S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

, ,
03/09/2020 - 01:29

ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా ఆదివారం కోల్‌కతాలో తృణమూల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాష్ట్ర మంత్రి చంద్రియామా భట్టాచార్జి సారథ్యంలో జరిగిన నిరసన ప్రదర్శన. బెంగళూరులో ముస్లిం మహిళలు వినూత్న రీతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొన్నారు. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా తమ చేతులపైనే నినాదాలు రాసుకుని ఇలా ప్రదర్శించారు.

03/09/2020 - 01:25

న్యూఢిల్లీ, మార్చి 8: గత నెలలో జరిగిన ఢిల్లీ అల్లర్లపై ప్రతిపక్షాలు చర్చకు పట్టు పట్టిన నేపథ్యంలో గత వారం జరిగిన రాజ్యసభ బడ్జెట్ సమావేశాలు కేవలం మూడు గంటలు కూడా జరక్కపోవడం గమనార్హం. ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత ఘర్షణలపై చర్చకు డిమాండ్ చేసిన నేపథ్యంలో 28.30 గంటల పాటు జరగాల్సి ఉండగా 26 గంటల పాటు ఎలాంటి చర్చా లేకుండానే రాజ్యసభ సమావేశాలు ముగియడం శోచనీయం.

03/09/2020 - 00:16

వయస్సు 96, పట్టుదల 16 వెరసి ఈ సూపర్ మచ్చికి నారీ శక్తి పురస్కారం. చదువుకు వయస్సు అడ్డుకాదని కేరళకు చెందిన కార్తియాయిని అమ్మ నిరూపించారు. ఆంగ్లం చదవడంలో తొలి పరీక్ష రాసి వందకు వంద మార్కులు తెచ్చుకున్నారు.
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా కేంద్ర మంత్రుల సమక్షంలో ఈ ఘన పురస్కారం అందుకున్నారు.

03/08/2020 - 05:54

న్యూఢిల్లీ: దేశంలో మరో మూడు కరోనా వైరస్ కేసులు నిర్ధారితమయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారంనాడు ప్రకటించింది. వీటితో మొత్తం దేశంలో ఈ కేసులు 34కు పెరిగాయని వెల్లడించింది.

03/08/2020 - 05:05

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనావైరస్ సోకకుండా చూసుకునేందుకు షేక్ హ్యాండ్(కరచాలనం)కు బదులు చేతులు జోడించి నమస్కారం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. నరేంద్ర మోదీ శనివారం జన ఔషధి దినోత్సవం సందర్భంగా జన ఔషధి లబ్దిదారులు, కేంద్రాల యజమానులతోవీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్‌కు సంబంధించిన వదంతులను ఎంత మాత్రం విశ్వసించకూడదని ఆయన దేశ ప్రజలకు హితవు చెప్పారు.

03/08/2020 - 05:03

న్యూఢిల్లీ, మార్చి 7: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ భారత్‌లోకి విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు కేంద్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచానికే పెను సవాల్‌గా మారిందని శనివారం ఇక్కడ పేర్కొన్నారు.

03/08/2020 - 05:02

కోల్‌కతా, మార్చి 7: ‘కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేవీఎం)కు త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి వివరాల బయోడాటాను ఈ బాక్సులో వేయండి’ అని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆశావాహులకు పిలుపునిచ్చింది.

03/08/2020 - 01:56

న్యూఢిల్లీ, మార్చి 7: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం భావోద్వేగానికి లోనయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జనరిక్ మెడిసిన్ కార్యక్రమం’ లబ్ధిదారు అయిన ఒక మహిళ ప్రధానికి ‘మీలో దేవుడిని చూశాను’ అని చెప్పడంతో మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. డెహ్రాడూన్ నివాసి దీపా షా 2011లో పక్షవాతంతో బాధపడ్డారు.

03/08/2020 - 01:05

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేంద్రం షాక్ ఇచ్చింది. ఏబీని సస్పెండ్ చేయటం సమర్థనీయమేనని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. వెంకటేశ్వరరావు అవినీతిపై ఏప్రిల్ 7 తేదీలోగా చార్జిషీట్ దాఖలు చేయాలని కేంద్ర హోం శాఖ శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతికి సంబంధించిన ప్రాథమిక ఆదారాలు ఉన్నాయని కేంద్ర హోం శాఖ అభిప్రాయపడింది.

03/06/2020 - 06:43

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 30కి చేరింది. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. గురువారం మరో వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్‌గా వెల్లడి కావడంతో మొత్తం సంఖ్య 30కి పెరిగిందని, అయితే, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Pages