S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/14/2020 - 02:56

న్యూఢిల్లీ: దేశ రాజ్యాంగ నిర్మాణ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బోధనలను అనుసరించండి అని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బలమైన, సంపన్నమైన భారత దేశాన్ని సృష్టించడానికి దోహదం చేయాలని ఆయన కోరారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

04/14/2020 - 02:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డౌన్ వల్ల కరోనా వైరస్ అదుపులోకి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్తగా ఎలాంటి కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.

04/14/2020 - 02:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులకు వీసా, ఈ-వీసా పరిమితి గడువును పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు సోమవారం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇటీవల భారత్ వచ్చిన పలువురు విదేశీయులు తిరిగి తమ స్వదేశాలకు వెళ్లేందుకు గడువు తీరిపోతే, అలాంటి వారికి ఈనెల 30వరకు వీసా, ఈ-వీసా గడువును పొడిగించింది.

04/14/2020 - 02:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు తల్లడిల్లుతుంటే సోమవారం ఢిల్లీ ప్రజలను భూకంపం వణికించింది. అయితే భూకంపం తీవ్రత (2.7) స్వల్పంగా ఉండడంతో ఆస్తి, ప్రాణ నష్టమేమీ జరగలేదు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. 24 గంటల్లో ఇది రెండోసారి.

04/15/2020 - 19:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మంగళవారంతో ముగుస్తున్న 21 రోజుల లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించే అవకాశాలున్నాయ. కరోనా వైరస్‌ను కట్టడి చేస్తూనే లాక్‌డౌన్ కారణంగా స్తంభించిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండంచెల విధానాన్ని అవలంబించవచ్చునని అంటున్నారు.

04/14/2020 - 00:42

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సోమవారం నుండి విధులకు హాజరౌతున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా గత 21 రోజుల నుండి ఇంటి నుండి పని చేస్తున్న మంత్రులు సోమవారం ఉదయం పది గంటలకే తమ, తమ కార్యాలయాలకు చేరుకోవటం గమనార్హం. వీరితోపాటు సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులు కూడా తమ విధులకు హాజరవుతున్నారు.

03/23/2020 - 06:14

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం పేర్కొన్నారు. నిపుణుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన వ్యక్తులను ప్రభుత్వం గుర్తిస్తోందని చెప్పారు. ‘కరోనా లక్షణాలున్న వ్యక్తులెవరైనా మీ సమీపంలో ఉంటే అలాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దనీ..

03/23/2020 - 06:12

హైదరాబాద్, మార్చి 22: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు.

03/23/2020 - 01:48

న్యూఢిల్లీ, మార్చి 22: ఇటీవలి సార్క్ సమావేశాల్లో ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా నియంత్రణకు సభ్య దేశాలు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సందర్భంగా సార్క్ విపత్తుల నిర్వహణా కేంద్రం ఆదివారం కరోనా వైరస్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

03/23/2020 - 01:47

బెరంపూర్ (పశ్చిమ బెంగాల్), మార్చి 22: యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దేశంలోనే అత్యధిక కేసులు కేరళలో నమోదుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇజారుల్ సీక్ (30) అనే నిరుపేద వ్యక్తి ఉపాధి కోసం కేరళకు వెళ్లి జీవనోపాధి పొందుతున్నాడు.

Pages