S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/21/2020 - 16:10

న్యూఢిల్లీ: కరోనా వ్యాధి వ్యాప్తి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ బాలీవుడ్ గాయని కనిక కపూర్‌పై కేసు నమోదు అయింది.

03/21/2020 - 16:29

జెనీవా: మహమ్మారి కరోనా విషయంలో యువత అతీతం కాదని, నిర్లక్ష్య ధోరణి తగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హితవు పలికింది. కరోనా బారిన పడుతున్న వారు.. ప్రాణాలు కోల్పోతున్నవారిలో వయసుపైబడిన వారే అధికంగా ఉన్నప్పటికీ యువత తక్కువ అంచనా వేసి ప్రాణాల మీదకు తెచ్చకోవద్దని డబ్ల్యూహెచ్‌ఓ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్ హెచ్చరించారు. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా..

03/21/2020 - 16:28

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆదివారం ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు రైళ్లు నిలిచిపోనున్నాయి. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లు రెండు మూడింటిని అవసరాన్ని బట్టి నడిపించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు.

03/21/2020 - 16:27

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) చాపకింద నీరులా వ్యాప్తిచెందుతోంది. శుక్రవారం నాటికి 230గా ఉన్న కరోనా పాజిటివ్‌ కేసులు.. శనివారం మధ్యాహ్నం ఆ సంఖ్య 271కి చేరింది. ఈ మేరకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎమ్‌ఆర్‌) శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు మహారాష్ట్రలో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

03/21/2020 - 16:26

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ మూడవ పాజిటివ్‌ కేసు నమోదైంది. స్కాంట్లాండ్‌ నుంచి రాష్ర్టానికి వచ్చిన మహిళకు నావల్‌ కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు నేడు అధికారికంగా ధృవీకరించారు. అదేవిధంగా కోల్‌కతాలోని బల్లేగంగా ప్రాంతంలో హోం క్వారంటైన్‌ గైడ్‌లైన్స్‌ పాటించని మరో ఇద్దరి మహిళలను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

03/21/2020 - 16:25

లక్నో : కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దినసరి కూలీల పరిస్థితి ధీనంగా మారింది. రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారి కూలీలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆఫర్‌ ప్రకటించారు. యూపీలోని 15 లక్షల మంది రోజువారి కూలీలతో పాటు భవన నిర్మాణ రంగంలో పని చేసే 20.37 లక్షల మంది కార్మికులకు రోజుకు రూ. వెయ్యి చొప్పున ఇస్తామని యోగి స్పష్టం చేశారు. ఈ డబ్బు..

03/21/2020 - 16:23

న్యూఢిల్లీ :అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బృందంలోని ఓ వ్యక్తికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. అయితే, అతడు అధ్యక్షుడు ట్రంప్‌తో కానీ, ఉపాధ్యక్షుడితో కానీ నేరుగా కలవలేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, అమెరికాలో కరోనాఈ మహమ్మారి బారినపడి 230 మంది ప్రాణాలు కోల్పోయారు.

03/20/2020 - 13:26

న్యూఢిల్లీ:ఈరోజు ఉరితీసిన అనంతరం నిర్భయ దోషుల మృతదేహాలను వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు మరణదండన అమలు చేశారు. దోషులుగా తేలిన ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మలను తీహార్‌ జైలులో శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరి తీశారు.

03/20/2020 - 13:26

న్యూఢిల్లీ:మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాజీనామా చేశారు. ఆయన ఈ మేరకు గవర్నర్ లాల్జి టాంటన్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ రోజు అసెంబ్లీలో జరగాల్సిన బలపరీక్ష కంటే ముందే తన రాజీనామాను సమర్పించారు. సీఎం కమల్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు.

03/20/2020 - 12:44

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు టీమ్ ఇండియా మద్దతు పలికింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ,కోచ్ రవిశాస్ర్తీ, ఇంకా పలువురు క్రీడాకారులు బాసటగా నిలిచారు. మనమంతా బాధ్యతాయుతమైన పౌరులం. మన ఆరోగ్య భద్రత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును పాటిద్దాం అని పిలుపునిచ్చారు.

Pages