S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/14/2020 - 03:51

ముంబయి: కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో, లాక్ డౌన్‌ను కేంద్రం కనీసం మరో వారం రోజులు పొడిగిస్తుందన్న వార్తల నేపథ్యంలో, సోమవారం కూడా భారత స్టాక్ మార్కెట్లలో పతనం తప్పలేదు. కేంద్ర విధించిన లాక్ డౌన్ ఈనెల 14వ తేదీతో ముగుస్తుంది. అయితే, మరో వారం లేదా రెండు వారాలు కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

04/14/2020 - 03:10

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: గత మూడు వారాలుగా భారత దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ వల్ల అనూహ్య రీతిలో దేశ ఆర్థిక వ్యవస్థకు అపారమైన నష్టం కలిగే అవకాశం ఉంది. మంగళవారం ముగుస్తున్న ఈ 21 రోజుల లాక్ డౌన్ కాలంలో దాదాపుగా భారత దేశం అంతా మూత పడింది. ఫ్యాక్టరీలు పని చేయలేదు, వ్యాపారాలు నడవలేదు, విమానాలు తిరగలేదు, రైళ్ళు పట్టాలు ఎక్కలేదు. వాహనాల రాకపోకలు కూడా దాదాపుగా ఆగిపోయాయి.

04/14/2020 - 02:54

బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీసిందని కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్డియూరప్ప ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మార్గాలు అనే్వషిస్తున్నట్టు సోమవారం ఇక్కడ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు వారాల లాక్‌డౌన్ మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల కోసం తాము వేచిచూస్తున్నట్టు సీఎం చెప్పారు.

04/14/2020 - 02:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) తన ఉత్పత్తిలో 15 శాతం కోత విధించింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సప్లయర్లు కొనుగోళ్లను తగ్గించుకోవడంతో ఓఎన్‌జీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల 25వ తేదీన దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించక ముందు ఓఎన్‌జీసీ రోజుకు 64.3 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసేది.

04/14/2020 - 02:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కరోనా వైరస్ కారణంగా అతలాకుతలమైన ఆటో మొబైల్ రంగాన్ని ఆదుకోవడానికి తక్షణ సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (్ఫడా) కోరింది. ఈ మహమ్మారి కారణంగా మొత్తం పరిశ్రమ కుదేలైందని పేర్కొంది. లాక్‌డౌన్‌తో ఉత్పత్తి, రవాణా, అమ్మకాలు నిలిచిపోయాయని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొంది.

04/13/2020 - 23:47

అమరావతి, ఏప్రిల్ 13: సంక్షోభ కాలంలోనూ ప్రజాధనం ఆదా చేయడంపై దృష్టి పెట్టినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ తెలిపింది. మార్చి నెలలో చౌకగా లభించే విద్యుత్ కొనుగోలు చేసి 56కోట్ల రూపాయల మేర మిగిల్చినట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మార్చిలో సంస్థ పరిస్థితిపై ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ సోమవారం సమీక్ష జరిపారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖరరెడ్డి సోమవారం విలేఖరులకు తెలిపారు.

04/13/2020 - 23:00

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఇప్పటివరకు అత్యవసర సరుకులను రవాణా చేసే వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేంది. ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాయి.

03/23/2020 - 06:13

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై ఈవారం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అనిశ్చితిలోనే లావాదేవీలు కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నది. గత వారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ ఏకంగా 4,187.52 పాయింట్లు (12.27 శాతం) పతనమైతే, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 1,209.73 పాయింట్లు (12.15 శాతం) నష్టపోయింది.

03/23/2020 - 05:57

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తే, ఈ పేరు అందరికీ తెలిసింది కాబట్టి, ప్రత్యేకంగా ప్రచారం
చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నారో ఏమోగానీ అదే పేరుతో బీరును మార్కెట్లోకి విడుదల చేశారు. ఉత్తర లండన్‌లోని

03/23/2020 - 05:36

న్యూఢిల్లీ, మార్చి 22: భారత స్టాక్ మార్కెట్లలో గత వారం బేర్ ఆధిపత్యం కొనసాగడంతో, దేశంలోని అతి పెద్ద కంపెనీలు విలవిల్లాడాయి. ‘టాప్-10’ కంపెనీల మార్కెట్ విలువ సుమారు 3.63 లక్షల కోట్ల రూపాయలు తగ్గిందంటే ప్రతికూల పరిస్థితులు ఏ స్థాయిలో మార్కెట్లను దెబ్బతీస్తున్నాయో ఊహించుకోవచ్చు.

Pages