S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/23/2020 - 05:31

న్యూఢిల్లీ, మార్చి 22: కరోనా వైరస్ కారణంగా దారుణంగా దెబ్బతిన్న పరిశ్రమను ఆదుకోవడానికి పన్ను మినహాయింపు కల్పించాలని సినిమా ఆపరేటర్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా బకాయిలు, రుణాల చెల్లింపులకు ఏడాది గడువు ఇవ్వాలని కోరారు. వివిధ విద్యుత్ డిస్కాంలు కనీస చార్జీల కింద వసూలు చేస్తున్న మొత్తాలను రద్దు చేయాలని కూడా మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) ఒక ప్రకటనలో కోరింది.

03/23/2020 - 05:31

న్యూఢిల్లీ, మార్చి 22: మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఫిబ్రవరి నెలలో కొత్తగా మూడు లక్షలకు పైగా ఇనె్వస్టర్ ఖాతాలను తెరచింది. దీంతో ఈ పరిశ్రమలో మొత్తం ఇనె్వస్టర్ ఖాతాల సంఖ్య 8.88 కోట్లకు పెరిగింది. ఇలాంటి పథకాలలో ఉన్న మార్కెట్ రిస్క్‌ల గురించి మదుపరులకు గల అవగాహనను ఇది సూచిస్తోంది. అయితే, అంతకు ముందు రెండు నెలలతో పోలిస్తే ఫిబ్రవరి నెలలో ఇనె్వస్టర్ ఖాతాల సంఖ్య వృద్ధిలో వేగం తగ్గింది.

03/22/2020 - 04:53

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంతో సామాజిక దూరాన్ని అవలంబిస్తున్నందున తలెత్తనున్న సమస్యల నుంచి బయటకు వచ్చేందుకు భారత పెట్రోలియం కార్పొరేషన్ (ఐఓసీ) స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగదని ఐఓసీ హామీ ఇచ్చింది. ఎయిర్‌లైన్స్‌కు కూడా ఇంధనం ఇదివరకటి మాదిరిగానే అందుతుందని ఐఓసీ చైర్మన్ సంజీవ్ సింగ్ స్పష్టం చేశారు.

03/22/2020 - 04:27

విజయవాడ, మార్చి 21: జనతా కర్ఫ్యూలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మొవ్వా తిరుమల కృష్ణబాబు అవసరమైన చర్యలు తీసుకున్నారు. రోడ్డుపైకి ప్రజాలెవరూ బయటకు రాకుండా నిరోధించేందుకు ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 12వేల బస్సులను శనివారం అర్ధరాత్రి నుంచి ఎక్కడికక్కడ డిపోల్లో నిలిపివేశారు.

03/22/2020 - 03:58

నిత్యావసర వస్తువులకు ఎలాంటి కొరత లేకుండా చూస్తామని, కాబట్టి ముందుగానే వాటిని కొని, నిల్వ చేయాల్సిన

03/22/2020 - 03:54

*బ్యూనస్ ఎయిర్స్‌లోని జార్జి న్యూబెరీ ఎయిర్‌పోర్టులో నిలిపి ఉంచిన వాణిజ్య విమానాలు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ఈనెల 31వ తేదీ వరకు విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగుతాయని అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్ ప్రకటించిన కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎగుమతులు తగ్గడంతో వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

03/22/2020 - 03:51

న్యూఢిల్లీ, మార్చి 21: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పలు వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, పార్క్‌లు మూతపడడంతో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు ఉపాధి కోల్పోతున్నారు. దీనిపై సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ (సీఏపీఎస్‌ఐ) ఆందోళన వ్యక్తం చేసింది.

03/22/2020 - 03:57

కోల్‌కతా, మార్చి 21: ఇతరత్రా రంగాల మాదిరిగానే వజ్రాలు, ఆభరణాల రంగంలోనూ బీమా సదుపాయం ఉండాలని వ్యాపారవేత్తలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సూచించింది. దీని వల్ల బ్యాంకులు మరింత స్వేచ్ఛగా, భయాందోళనలు లేకుండా రుణాలను అందచేయానికి వీలుంటుందని అభిప్రాయపడింది.

03/22/2020 - 03:49

ముంబయి, మార్చి 21: కరోనా వైరస్ ప్రభావం మిగతా దేశాల్లో మాదిరిగానే భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా భారీ నష్టాలు నమోదయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో ఈ వారం ప్రారంభంలోనే సెనె్సక్స్ ఏకంగా 2,713.41 పాయింట్లు పతనమై 31,390.07 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 757.80 పాయింట్లు నష్టపోయి 9,197.40 పాయింట్లకు పడిపోయింది.

03/20/2020 - 07:29

*సూరత్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ ఔషధాన్ని ట్రాలీలపై స్ప్రే చేస్తున్న కార్మికురాలు. కోవిడ్-19 వ్యాధిగ్రస్తులు రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా, షాపింగ్ మాల్స్ వెలవెలపోతున్నాయి. కొనుగోళ్లు భారీగా తగ్గడంతో, యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీ, ముంబయి తదితర నగరాల్లో ఇప్పటికే షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి.

Pages