-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, మార్చి 8: గత వారం నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు ఈవారం కూడా ఒత్తిడిలోనే కొనసాగే అవకాశాలున్నాయని విశే్లషకులు జోస్యం చెప్తున్నారు. కరోనా వైరస్ అత్యంత వేగంగా ప్రపంచమంతటా వ్యాపించడం, భారత్లో ఈ వైరస్ బాధితుల సంఖ్య పెరగడంతోపాటు ఎస్ బ్యాంక్ సంక్షోభం కూడా గత వారం మార్కెట్లను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద ప్రైవేటీకరణ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)లో తనకు ఉన్న 52.98 శాతం వాటాలను అమ్మకానికి పెట్టింది. బిడ్స్ను శనివారం ఆహ్వానించడం ద్వారా మోదీ సర్కారు భారీ అంకానికి తెరతీసింది. గతంలో ప్రభుత్వ రంగ సంస్తల నుంచి ఇంత భారీ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణగానీ, ప్రైవేటీకరణగానీ జరగలేదు.
న్యూఢిల్లీ, మార్చి 7: రిలయన్స్ కమ్యూనికేషేన్స్ (ఆర్కామ్) దివాళా రెజల్యూషన్ ప్రతిపాదన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) ముందుకు వచ్చింది. ఆర్కామ్ ఆస్తుల అమ్మకాల ద్వారా సుమారు 23,000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా. ఈనెల రెండో తేదీన ప్రారంభమైన రుణదాతల కమిటీ (సీఓసీ) రెజల్యూషన్ పిటిషన్ను ఈ ఓటింగ్ను నిర్వహించింది.
ముంబయి, మార్చి 7: భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఎస్ బ్యాంక్కు ఊతం ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే బ్యాంక్ పునర్ణిర్మాణ ప్రక్రియను పరిశీలిస్తున్నట్టు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. రీకన్స్ట్రక్షన్ ముసాయిదాను బ్యాంక్ అధికారులు పరిశీలిస్తున్నారని, లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నివేదిక ఇస్తారని తెలిపారు.
ముంబయి: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నెలకొన్న అనిశ్చితి ప్రపంచ వ్యాప్తంగా అన్ని మార్కెట్లతోపాటు భారత స్టాక్ మార్కెట్లను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. దేశీయ మదుపరులు ఆదుకోవడంతో కొంత వరకు కొలుకున్నప్పటికీ, వారం మొత్తం ఫలితాలను చూస్తే నష్టాలు భారీగానే ఉన్నాయి. సెన్సెక్స్ 720.67 పాయింట్లు పతనం కావడం మార్కెట్ల పరిస్థితికి అద్దం పడుతుంది.
షాద్నగర్, మార్చి 7: కరోనా వైరస్తో కోళ్ల పరిశ్రమ ఉలిక్కిపడుతోంది. కోవిడ్-19వైరస్ కారణంగా చికెన్ ప్రియులు చాలా మటుకు వెనుకంజ వేయడంతో చికెన్ సెంటర్లు వినియోగదారులు లేక వెలవెలబోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే చికెన్ సెంటర్లు కరోనా వైరస్ కారణంగా రద్దీ తగ్గిపోయి అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విజయవాడ పశ్చిమ, మార్చి 5: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం నగరవాసులకు కంపితులను చేస్తోంది. జర్మనీ నుండి నగరానికి వచ్చిన వ్యక్తిని కరోనా అనుమానంతో పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు లేవని వైద్యులు తేల్చగా స్వయంగా కలెక్టర్ ఇంతియాజ్ విషయాన్ని ప్రకటించడంతో నగరవాసులు ఊపిరిపీలుకున్న విషయం విదితమే. అయితే నగరంలో పొల్యూషన్ మాస్క్ల కొరత తీవ్రంగా ఉంది.
సికిందరాబాద్, మార్చి 5: పటణ ప్రయాణికుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పేటీఎంతో కలసి క్యూఆర్ కోడ్ ఆధారిత టికెటింగ్ విధానాన్ని ప్రారంభించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. బేగంపేట్లోని మెట్రో భవన్లో పేటీఎం క్యూ ఆర్కోడ్ ఆధారిత మెట్రో టికెటింగ్ వ్యవస్థను ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు.
ముంబయి: ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా తన తొలగింపును సవాలు చేస్తూ చందా కొచర్ దాఖలు చేసిన పిటిషన్ను బొంబే హైకోర్టు గురువారం కొట్టివేసింది. ప్రైవేటు సంస్థలో వ్యక్తిగత సర్వీసు కాంట్రాక్టు విధానంలో ఉన్న కారణంగా ఈ వివాదంలో జోక్యం చేసుకోదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఎన్ఎం జాందార్, ఎంఎస్ కార్నిక్ల డివిజన్ బెంచ్ ధర్మాసనం ఈ కేసును విచారించింది.
విజయవాడ, మార్చి 5: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ సంస్థ ముందుకు వచ్చింది. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు స్విట్జర్లాండ్కు చెందిన ఐఎంఆర్ ఏజీ కంపెనీ ముందుకు వచ్చింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఆ కంపెనీ ప్రతినిధులు గురువారం భేటీ అయ్యారు. కడప జిల్లాల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఆ కంపెనీ ఆసక్తి చూపింది.