S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

,
04/14/2020 - 04:03

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 13: కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా గత మూడు వారాలుగా గోదావరి జిల్లాలు కర్ఫ్యూ వాతావరణంలో కాలం వెళ్లబుచ్చుతున్నాయి. ఉదయం 11 గంటల వరకూ నిత్యావసరాల కోసం వస్తున్న వారితో కాస్త జన సంచారం కనిపిస్తున్నప్పటికీ, ఆ తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

04/14/2020 - 04:01

గుంతకల్లు, ఏప్రిల్ 13: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో ఉన్న ఐసోలేషన్ రైల్వేకోచ్‌లను కలెక్టర్ గంధం చంద్రుడు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతే ఈ కోచ్‌లను వినియోగించుకుంటామన్నారు. జిలో 9 కంటోనె్మంట్ జోన్‌లను ఏర్పాటు చేశామన్నారు. పాజిటివ్ కేసులు, కాంటాక్ట్ కేసులను బట్టి హైరిస్క్ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు.

04/14/2020 - 03:59

కడియం/ఆలమూరు, ఏప్రిల్ 13: కరోనా మహమ్మారి ప్రజారోగ్యానే్న కాకుండా ప్రత్యక్షంగా ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో వేల ఎకరాల పూల తోటలపై కరోనా ప్రభావం పడింది. లాక్‌డౌన్ నేపథ్యంలో రవాణా స్తంభించడం, కూలీలు పూల తోటలకు రాకపోవడంతో తోటల్లోనే పూలు వాడిపోయి రాలిపోతున్నాయి. వేసవిలో మల్లెపూల దిగుబడి ఎక్కువగా ఉంటుంది.

04/14/2020 - 03:56

అనంతపురం, ఏప్రిల్ 13: కరోనా (కోవిడ్-19) మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోలిస్తే అనంతపురం జిల్లాలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు తక్కువగా నమోదైనా ప్రజలను భయం వెంటాడుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోయినా, కాంటాక్ట్ ట్రేసింగ్ (పాజిటివ్ వ్యక్తి కలిసిన వ్యక్తులు, వారు ఎవరెవరిని కలిశారన్న వివరాల సేకరణ) ద్వారా కొత్త కేసులు బయటపడే అవకాశాలున్నాయి.

04/14/2020 - 03:54

కడప, ఏప్రిల్ 13: కడప జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం రాత్రి వరకు 31 కేసులు నమోదయ్యాయి. సోమవారం ఎలాంటి కొత్తకేసులు నమోదుకాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. నమోదైన కేసుల్లో ఢిల్లీ మర్కస్‌కు వెళ్లి వచ్చిన వారు 17 మంది ఉన్నారు.

04/14/2020 - 03:53

పాడేరు, ఏప్రిల్ 13: ప్రపంచాన్ని గడగడలాడిస్తూ కరోనా వైరస్ విశాఖ మన్యం దరి చేరలేదు. కరోనాను కట్డడి చేసేందుకు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో ఈ భయంకర రక్కసి గిరిజన ప్రాంతంలో అడుగు పెట్టకపోవడంతో ఈ ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

04/14/2020 - 03:47

విజయవాడ పశ్చిమ, ఏప్రిల్ 13: కష్టకాలంలో ప్రతి ఒక్కరూ కాపు కాసి యూతనివ్వాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం చిట్టినగర్‌లోని శ్రీగౌతమ్ విద్యాలయం స్మార్ట్ క్యాంపస్‌లో మంత్రి చేతుల మీదుగా బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. గౌతమ్ విద్యాసంస్థల అధినేత ఎన్ సూర్యారావు ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు ఈ కిట్‌లు అందించారు.

04/14/2020 - 03:33

గుంటూరు, ఏప్రిల్ 13: గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ విస్తరిస్తోంది. ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారందరూ ఐసోలేషన్, క్వారంటైన్‌లకు పంపిన అనంతరం కూడా రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జిల్లాలో సోమవారం నాటికి 93 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో సోమవారం ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య వందకు చేరుతోంది.

04/14/2020 - 03:32

గుంటూరు (అరండల్‌పేట), ఏప్రిల్ 13: గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు కరోనా సెగ తగిలింది. వైద్యశాలలోని గుండె శస్త్ర చికిత్స విభాగంలో ఇటీవల చికిత్స పొందిన తెలంగాణకు చెందిన ఓ వ్యక్తికి ఆదివారం సాయంత్రం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతనికి చికిత్స అందించిన వైద్యులు, నర్సులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి తన పనుల నిమిత్తం ఈనెల 8వ తేదీన విజయవాడకు వచ్చారు.

04/14/2020 - 03:31

గుంటూరు, ఏప్రిల్ 13: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 విస్తరిస్తున్నప్పటికీ రాజధాని ఉద్యమం పేరిట బయట తిరుగుతూ, ఒకరినొకరు కలుసుకోవడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. సోమవారం ఈ మేరకు రాజధాని పరిధిలోని వెంకటపాలెం గ్రామస్తులకు పోలీసులు నోటీసులు జారీచేశారు.

Pages