-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు, ఏప్రిల్ 13: కోవిడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా ఉండేందుకు పోలీసుల నుండి పాస్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని, లాక్డౌన్ సమయంలో ప్రజల నుండి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని తెలిపారు.
విజయవాడ (సిటీ), ఏప్రిల్ 13: అప్పుడు లక్షలాది మంది చేసిన ప్రాణ త్యాగాల ఫలితంగా మనం ఈరోజు సేచ్ఛను అనుభవిస్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. జలియన్ వాలాబాగ్లో కాల్పుల్లో అమరులైన వారికి నివాళులు అర్పిద్దాం అంటూ సోమవారం ట్విట్టర్లో ది గార్డియన్ - లండన్ అనే కథనాన్ని పోస్టు చేశారు.
విజయవాడ (సిటీ), ఏప్రిల్ 13: రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మూడేసి చొప్పన ఎన్ 95 మాస్క్లను అందించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం కరోనాపై ఓ బ్రహ్మాస్త్రం వంటిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో కరోనాపై జరుగుతున్న పోరులో అతి తక్కువ ప్రాణ నష్టంతో బయటపడగమంటూ సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
పెనమలూరు, ఏప్రిల్ 13: రాష్ట్రంలోని కోటీ 40లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు అందుతాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పూర్తి స్టాక్ ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు.
విజయవాడ (సిటీ), ఏప్రిల్ 13: రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించినా అధికారులు సన్నద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ వి కనగరాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, పరిస్థితులు కుదుటపడిన తరువాత ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాల్సి వొచ్చినా అందుకు సర్వ సన్నద్దంగా ఉండాలన్నారు.
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కోవిడ్ నివారణ చర్యలపై సోమవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కోవిడ్ బాధితుల కోసం కనీసం 400 బెడ్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
కర్నూలు, ఏప్రిల్ 13: కర్నూలు జిల్లా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ ఎక్కడి వరకు వెళ్తుందోనన్న చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 1243 మంది అనుమానితులకు సంబంధించి పరీక్షలు నిర్వహించగా వారిలో 84 మందికి కరోనావ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వైద్య నిపుణుల ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతోంది.
అమరావతి, ఏప్రిల్ 13: గ్రామస్థాయిలో పంటల కోనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో రైతులు తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తరలించడంలో ఇబ్బందిపడే అవకాశం ఉండటంతో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో 786 కేంద్రాల ఏర్పాటుకు మార్క్ఫెడ్ చర్యలు చేపట్టింది.
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 7 కొత్త కేసులు నమోదయ్యాయి.
మచిలీపట్నం, ఏప్రిల్ 13: కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు రెడ్జోన్ ప్రాంతాల్లో పెద్దఎత్తున కోవిడ్-19 (కరోనా) నివారణకు ముందస్తుగా హోమియో మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని సీనియర్ ఐఏఎస్ అధికారిణి, రాష్ట్ర ఆయుష్ శాఖ కమిషనర్ పి ఉషాకుమారి తెలిపారు.