S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయిన్ ఫీచర్
తెలుగు సాహిత్యంలో ధిక్కరణ అక్షరాలు ఎక్కువగా వుండేవి. తెలంగాణ సాహిత్యం ధిక్కరణకు ప్రతీతి. గత ఐదు సంవత్సరాలుగా సాహిత్యంలో ధిక్కరణ గొంతులు వినిపించటంలేదు. ఇపుడు ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు ధిక్కరణ అక్షరాలకు ప్రాణం పోసేవి కావా? దేశంలో జరుగుతున్న మానవత్వం లేని రాక్షస సంఘటనలు ధిక్కరించేవిగా, ప్రశ్నించేవిగా లేవా? రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలో ఒక భాగం..
కాశీ విశ్వవిద్యాలయం పార్లమెంటు హాలు కిటకిటలాడుతున్నది. హాలు వసారా చుట్టూ కూడా జనం గజిబిజిగా ఇరుక్కుని ఉన్నారు. వేదిక ముందువరుసలో విశ్వవిద్యాలయోపాధ్యక్షులు ఆచార్య నరేంద్రదేవ్, విశ్వవిద్యాలయాచార్యులు, ప్రముఖుడు ఆసీనులయి ఉన్నారు. వేదిక నుంచి -
దేశభక్తి, మాతృభూమి పట్ల ప్రేమాభిమానము, జాతీయ సంస్కృతి అంశాలను ఇతివృత్తంగా చేసుకుని కథలు రాయడమంటే ప్రేమ, పెళ్లిళ్లు, విడాకులు, స్వేచ్ఛా శృంగారం, నేరాలు, ఘోరాలు అంశాలతో రాయడమంత సులువుకాదు. అయితే కథ షుగర్ కోటెడ్ మెడిసిన్లాగుండాలి’’... సాహిత్యాంబరములో ధృవతారగా నిలిచిన టాల్స్టాయ్ అభిప్రాయమది. ఆయన రాసిన కథలు విశ్వవిఖ్యాతమైనవి.
‘‘ఇదం కవిభ్యః పూర్వేభ్యః నమోవాకం ప్రశాస్మహే
వందేమహిచ వాణీం తామమృతాం ఆత్మనః కలామ్’’
(ఉత్తర రామచరిత్ర - భవభూతి)
నదీమతల్లులకు నారీత్వము ప్రసాదించి రసోదంచిత చమత్క్రియా కల్పనా కల్ప భవ్యమ్ముగా ఎవరు మహాప్రబంధమును శిల్పించి (సృష్టించి) సరిగమల మంజు హేలాగతీ మధురిమలను చిలికించునో అట్టివాడు తప్పక మహాకవే. వాడే మూర్తియైననూ హృజ్జాతము వసుగీతమే. ఇది యొక యోగ సందర్భము. సాహిత్యస్పృహే (చైతన్యం) కవికి నిజమైన గీటురాయి. ‘‘సాహిత్య దర్పణం’’ చెప్పినా, ఛార్లెమ్ బోదివేర్ చెప్పినా ఒకటే మాట.
సాహిత్య సార్థవాహులు కొందరు పట్ట్భాషిక్తులకు, బరాయ్యెం నవాబులకు బరాబరులుచేస్తూ, పొగడితల రగడలు రచిస్తూ, నిజాం ప్రభుత్వంలో పదవులు పట్టుకుని, ఎంతో అధికారం ఉన్నా ఇరుగుపొరుగులకు ఇంతైనా ఉపకారం చేయకపోగా, ఏవిటో తవ్వి తలకెత్తినట్టు మేకపోతు గాంభీర్యంతో మసలుతూ, పరివారగణంతో నవ్యరీతులకు నారులు పోసినవారని, సాహిత్యానికి కొత్త సొబగులు సమకూర్చినవారని, చరిత్రకు చరిత్ర యిచ్చినవారని కైవారాలు చేయించుకుంటున్న సమయంలో
శా॥ ‘‘అస్సే! చూస్సివషే! సే! చెవుడషే! అష్లాగషే! ఏమిషే!
విస్సావజల వారి బఱ్ఱినష ఆవిస్సాయ కిస్సారుషే!
విస్సండెంతటివాడె! యేండ్లు పదిషే! వెయ్యేండ్ల కీడే సుమా!
ఒస్సే బుఱ్ఱికి ఈడషే! వయసుకేముంషుందిలే! ఎంత వ
ర్చెస్సే!’ అందురు శ్రోత్రియోత్తమ పద స్ర్తిలాంధ్ర దేశంబునన్॥
వస్తువు కావ్యస్రష్ట చైతన్యాన్ని సూచిస్తుంది. దాని అభివ్యక్తికోసం వస్తు రహస్యాన్ని దొరకపుచ్చుకోవటంలో కవిత్వం ప్రతిఫలిస్తుంది. అంతేకాని కవి తాను ఎంచుకున్న రూపంలోనే కవిత్వం ద్యోతకముతుందనుకోవటం కేవలం అజ్ఞానం. రూపం బాహ్యం మాత్రమే. అంతర్గతమైన అగరు కనిపించదు. ఆ కనిపించకపోవటం కవిత్వమవదు. ఏదైతే కనిపిస్తుందో (రూపం) అది కావ్యకళ అనిపించుకోదు.
నాలుగు దశాబ్దాలనాటి- 1920నాటి- మాట. బాపట్లలో ప్లీడరు గుమాస్తాల నాటక సంఘం ఉండేది. దానిలో శ్రీ కామరాజు వేంకట నారాయణగారు కూడా సభ్యులు. ఆయన మేనల్లుండ్లలో ఒకరు కళాభిరుచి కలవాడు; పందొమ్మిదేండ్ల ప్రాయంవాడు. ఆతడు మేనమామతోపాటు ఆ నాటక సంఘానికి వెళ్ళి, నటుల తరిఫీదులలో హార్మోనియం శ్రుతి వేసేవాడు.
సామాజిక స్పృహ’’ ఎఱ్ఱ చొక్కా సోదరుల నోటి చొంగ. ఈ ‘‘ఎత్తుబడి చేత’’ వారి జన్మ హక్కు పత్రము. కనుక దానిని గురించి పాఠమును వారే వల్లెవేయవలెను. ఇతరులనరాదు. ఒకవేళ వేరువారట్లన్నచో వారు అభ్యుదయ నిరోధకులు. ఈ ‘‘అభ్యుదయ నిరోధక’’మన్న మాటయే చిత్రము. ‘‘అఱ చేతిని అడ్డంపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు’’ అనే నినాదాన్ని వీధి గోడలకతికించిన మేధావులే ‘‘అభ్యుదయ నిరోధక’’మన్న మాటను విస్తృతపరచినారు.