S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/19/2020 - 12:56

న్యూడిల్లీ: మాజీ చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్ రాజ్య‌స‌భ ఎంపీగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. గొగోయ్ ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్న స‌మ‌యంలో కొంద‌రు విప‌క్ష ఎంపీలు స‌భ నుంచి వాకౌట్ చేశారు. గొగోయ్ ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో విప‌క్షాలు వాకౌట్ చేయ‌డం స‌రైందికాద‌ని కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ అన్నారు.

03/19/2020 - 12:42

న్యూడిల్లీ: కర్నాటకలో కరోనా వ్యాధితో 76 ఏళ్ళ వ్యక్తి మృతి చెందాడు. కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప కరోనా వ్యాధి నివారణకు రూ. 200 కోట్లు విడుదల చేశారు. కర్నాటకలో బుధవారం మరో ఇద్దరకి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 13కు చేరింది.

03/19/2020 - 12:28

న్యూడిల్లీ:కరోనా ప్రభావంతో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటుండగా, ఇదివరకే రైలు టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వాటిని రద్దు చేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనిని పరిగణలోకి తీసుకున్న దక్షిణ రైల్వే ఈ నెలాఖరులోపు నడిచే పలు రైళ్లు రద్దు చేసింది.

03/19/2020 - 12:24

హైదరాబాద్‌: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శంషాబాద్‌ విమానాశ్రయం గురువారం నిర్మానుష్యంగా మారింది. అంతేకాక పలు ఎయిర్‌లైన్‌ సర్వీసులు కూడా రద్దవడంతో రాకపోకలు స్థంభించాయి. మరోవైపు విదేశాల నుంచి వస్తున్న వారిని నేరుగా వారి లగేజ్‌తో సహా ఐసోలేషన్‌ వార్డులకు తీసుకెళ్తున్నారు.

03/19/2020 - 12:16

న్యూడిల్లీ: నిర్భ‌య రేప్ కేసు నిందితుడు ప‌వ‌న్ గుప్తా వేసిన క్యూరేటివ్ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. తాను బాల్య నేర‌స్థుడిన‌ని పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను కోర్టు తిర‌స్క‌రించింది. 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో.. న‌లుగురు నిందితుల‌కు రేపు ఉరి తీయ‌నున్నారు. తాజా తీర్పు ప‌ట్ల నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి స్పందించారు. రేపు క‌చ్చితంగా నిర్భ‌య‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ఆమె తెలిపారు.

03/19/2020 - 06:09

న్యూఢిల్లీ: లడఖ్‌లోని ఓ సైనికుడికి కరోనా పాజిటీవ్ రావడంతో కేంద్రం అప్రమత్తమైంది. లడఖ్‌లో ‘స్నో వారియర్స్’గా పిలిచే స్కౌట్స్ ఇన్‌ఫెంటరీ రిజిమెంట్‌కు చెందిన 34 ఏళ్ల జవానుకు వైరస్ సోకిందన్న వార్త పారామిలటరీ దళాల్లో కలకలం రేపింది.

03/19/2020 - 06:17

కరోనా వైరస్ భయంతో ప్రజలు బయటకు రాకుండా తమను తామే ఇళ్లకు పరిమితం చేసుకుంటున్నారు. దీంతో షాపింగ్ మాల్స్ నుంచి సినిమా థియేటర్ల వరకు ఎక్కడ చూసినా కర్ఫ్యూ వాతావరణమే కనిపిస్తున్నది. మన దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, పార్క్‌లు, కల్యాణ మండపాలను ఈనెలాఖరు వరకు మూసివేసిన విషయం తెలిసిందే.

03/19/2020 - 05:52

న్యూఢిల్లీ, మార్చి 18: దేశ వ్యాప్తంగా కరోనాపై యుద్ధం సాగుతోంది. వైరస్‌ను మరింత విజృంభించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అయితే పరీక్షల ప్రక్రియ మరింత పకడ్బంధీగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్యూహెచ్‌ఓ) హెచ్చరిస్తోంది.

03/18/2020 - 23:54

మూడేళ్ల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా బుధవారం తమ పాలనపై వివరాలతో కూడిన పుస్తకాన్ని లక్నోలోని
లోక్‌భవన్ కార్యాలయంలో ఆవిష్కరిస్తున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య, దినేష్ శర్మ కూడా ఉన్నారు

03/18/2020 - 23:51

న్యూఢిల్లీ, మార్చి 18: జమ్మూకాశ్మీర్‌లో గత సంవత్సరం ఆగస్టులో అధికరణం 370ని రద్దు చేసినప్పటి నుంచి ఈ ఎనిమిది నెలల కాలంలో ఉన్నంత ప్రశాంతత గతంలో ఎన్నడూ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభలో చెప్పారు.

Pages