S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/08/2016 - 12:33

భద్రాచలం, ఏప్రిల్ 7: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ఖమ్మం జిల్లా భద్రాచలం మన్యంలోని మావోయిస్టుల కంచుకోటలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్ర్తిశిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం పర్యిటించారు. ఖమ్మం జిల్లా వాజేడు నుంచి భద్రాచలం వరకు సుడిగాలి పర్యటన చేశారు. రూ.100కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

04/08/2016 - 12:32

గుంటూరు, ఏప్రిల్ 7: ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు సిగ్గు లేదా అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

04/08/2016 - 12:31

ముంచంగిపుట్టు, ఏప్రిల్ 7: పోలీసుల ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు బుధవారం రాత్రి కాల్చి చంపారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జైరాం పాంగి తన స్వగ్రామమైన సింగోయి నుండి ద్విచక్ర వాహనంపై మరో వ్యక్తితో కలిసి వెళ్తుండగా ఆంధ్ర-ఒడిశా సరిహద్దు జోలాపుట్టు ఆర్‌ఎఫ్ వద్ద రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చిన నలుగురు సాయుధ మావోయిస్టులు అడ్డుకున్నారు.

04/08/2016 - 12:30

అనంతపురం, ఏప్రిల్ 7 : అనంతపురం, కడప జిల్లాలో గురువారం తెల్లవారుజామున రెండు రైళ్లలో దొంగలు దోపిడీలకు పాల్పడ్డారు. అనంతపురం రూరల్ పరిధిలోని తాటిచెర్ల వద్ద బెంగళూరు-షోలాపూర్ ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సిగ్నల్ వైరు కట్ చేసి దోపిడీకి తెగబడ్డారు.

04/08/2016 - 12:29

విజయవాడ, ఏప్రిల్ 7: కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను గట్టిగా వినిపించనుందని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలియచేశారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం విలేఖరులతో మాట్లడుతూ రాష్ట్రానికి రావల్సిన కృష్ణా జలాలు రాకుండాపోతున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన కృషి ఫలితంగానే రాయలసీమకు పుష్కలంగా నీరు అందుతోందని ఆయన చెప్పారు.

04/08/2016 - 12:28

విజయవాడ, ఏప్రిల్ 7: తెలుగుదేశం, బిజెపి క్యాడర్ పరస్పరం కత్తులు దూసుకుంటోందా? ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందా? మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలన్న సాహసోపేత నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? తెలంగాణలో టిడిపి నుంచి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లోకి వెళ్లినప్పుడు ఆక్రోశం వ్యక్తం చేసిన చంద్రబాబు ఏపిలో వైకాపాను ఖాళీ చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?

04/08/2016 - 12:25

విజయవాడ, ఏప్రిల్ 7: రాష్ట్రంలో వడగాడ్పులకు ఈ వేసవిలో ఇప్పటి వరకూ 45 మంది మరణించారని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో 11 మంది మరణించారని ఆయన పేర్కొన్నారు.

04/08/2016 - 12:25

అనంతపురం, ఏప్రిల్ 7 : నిస్సహాయులైన పేదలు, నిరుపేదలకు చేయూతను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న పేదల ఇంటి వద్దకే నిత్యావసర సరుకులను అందించే మీ ఇంటికి-మీరేషన్ కార్యక్రమాన్ని కాటిగానికాల్వ గ్రామంలోగురువారం ఆమె ప్రారంభించారు.

04/08/2016 - 12:22

సింహాచలం, ఏప్రిల్ 7: భగవంతుడు అందించిన ఈ సృష్టిని గౌరవించాలని, ప్రతి ఒక్కరిలో భక్త్భివం పెంపొందింపజేయగలిగితే మానవ జన్మకు సార్థకత చేకూరుతుందని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవాలయ అనువంశిక ధర్మకర్త, కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక గజపతిరాజు అన్నారు. గురువారం ఆయన కుటుంబ సమేతంగా సింహాచలేశుని దర్శనం చేసుకున్నారు.

04/08/2016 - 12:21

విజయవాడ, ఏప్రిల్ 7: ముస్లిం మైనార్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 710.54 కోట్లు నిధులు కేటాయించిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, ఐటి, తెలుగుభాష, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనార్టీ ముస్లింలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అభినందిస్తున్నారన్నారు.

Pages