ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యేలను కొనడానికి సిగ్గులేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 7: ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు సిగ్గు లేదా అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గురువారం గుంటూరులోని ఓ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలు పార్టీ మారితే అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందంటూ గగ్గోలు పెట్టిన టిడిపి నాయకులు ఇక్కడమాత్రం న్యాయవిరుద్ధంగా ప్రవర్తించడం దుర్మార్గమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అల్టిమేటం జారీ చేయడం లేదని ప్రశ్నించారు. గత రెండు సంవత్సరాల్లో రాష్ట్ర పాలన పూర్తిగా భ్రష్టుపట్టిందని, కబ్జాల మయంగా తయారైందని, వీటన్నింటికీ లోకేష్ పెత్తనమే కారణమంటూ అంబటి ధ్వజమెత్తారు. సిఎం చంద్రబాబుకు తన భవిష్యత్తుపై బెంగ ఉన్నందునే 102 మంది టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వైసిపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బలాన్ని పెంచుకునేందుకు అహర్నిశలూ కష్టపడుతున్నారని అంబటి ఎద్దేవాచేశారు.