-
దుబాయ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20ల్లో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.
-
పెర్త్, డిసెంబర్ 12: న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు మొదటి రోజు ఆస్ట్ర
-
రావల్పిండి, డిసెంబర్ 12: రావల్పిం డిలో జరుగుతున్న పాక్-శ్రీలంక మొద టి టెస్టుక
-
హైదరాబాద్, డిసెంబర్ 12: రంజీ ట్రోఫీ 2019-20లో భాగంగా గుజరాత్తో జరుగుతున్న మ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
లక్నో, నవంబర్ 27: భారతరత్న అటల్ బిహారీ వాజపేయి స్టేడియంలో బుధవారం అఫ్గనిస్తాన్తో ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ బౌలర్ రఖీం కామ్వాల్ తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఏడు వికెట్లు సాధించాడు. దీంతో అఫ్గనిస్తాన్ 68.3 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ జావెద్ అహ్మదీ 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, మిడిలార్డర్లో అఫ్సర్ జజాయి 32, టైలెండర్ అమీర్ అమ్జా 34 పరుగులు చేశారు.
బ్యాంకాక్లో బుధవారంతో ముగిసిన ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్స్ కాంపౌండ్ మిక్స్డ్ పెయిర్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత ఆర్చర్లు అభిషేక్ వర్మ, జ్యోతి సురేఖ వెన్నం. ఈ టోర్నమెంట్లో భారత్కు ఈ ఒక్క పతకమే లభించింది. వీరు చైనీస్ తైపీకి చెందిన ఈ సువాన్ చెన్, చియూ లే చెన్ జోడీపై 158-151 పాయింట్ల తేడాతో గెలుపొందారు
*చిత్రం... మాండ్రిడ్లో స్పెయిన్ కొత్త కోచ్ లాస్ రొజాస్తోపాటు జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరిస్తున్న స్పానిష్ ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు లూయిస్ రూబియల్స్, స్పోర్ట్స్ డైరెక్టర్ జొస్ లూయిన్ మొనిలా
లక్నో, నవంబర్ 27: మూడో సీడ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ ప్రారంభమైన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బాడ్మింటన్ టోర్నమెంట్లో రెండో రౌండ్కు చేరాడు. తొలి రౌండ్లో అతను రష్యాకు చెందిన వ్లాదిమిర్ మాల్కొవ్ను 21-12, 21-11 తేడాతో కేవలం 36 నిమిషాల్లోనే ఓడించి ముందంజ వేశాడు. రెండో రౌండ్లో అతను తన సహచర ఆటగాడు పారుపల్లి కశ్యప్తో తలపడతాడు. కశ్యప్ తొలి రౌండ్లో ఫ్రెంచ్ ఆటగాడు నుకాస్ కోర్విని ఢీకొనాల్సి ఉంది.
న్యూఢిల్లీ, నవంబర్ 27: పాఠశాల స్థాయి నుంచే ఉత్తమ క్రీడాకారులను తయారు చేసే విధంగా ప్రయత్నం జరుగుతోందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. అందులో భాగంగానే అన్ని పాఠశాలలు ప్రత్యేకించి కేంద్రీయ విద్యాలయాలు పిల్లల శారీర దారుఢ్యంపై శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. కేంద్రీయ విద్యాలయాలన్నీ ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.
న్యూఢిల్లీ, నవంబర్ 27: యువ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ రిషబ్ పంత్పై ఎవరి ఒత్తిడి లేదని భారత సీనియర్ క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. ఇటీవల పంత్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడాన్ని ప్రస్తావిస్తూ నిజానికి పంత్ తనకు తానే ఒత్తిడిని పెంచుకుంటున్నాడని వ్యాఖ్యానించాడు.
దుబాయ: బంగ్లాదేశ్తో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్ అనంతరం మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకులను విడుదల చేసింది. ఇటీవల బంగ్లాతో జరిగిన టెస్టు సిరీస్లో సెంచరీ సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 25 పాయింట్లు మెరుగు పర్చుకొని 928 రేటింగ్ పాయంట్లతో మొదటి స్థానానికి 3 పాయంట్ల దూరంలో నిలిచి, రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
కోల్కతా, నవంబర్ 26: స్వదేశం లో తొలి డే నైట్ టెస్టును విజయవం తంగా నిర్వహించిన బీసీసీఐ అధ్య క్షుడు సౌరవ్ గంగూలీకి సచిన్ ఓ సూచన చేశాడు. పింక్ బాల్ క్రికెట్ను విజయవంతం చేసినట్లుగానే దులీప్ ట్రోఫీ సంగతి కూడా చూడాలని సూ చించారు. ప్రస్తుతం దేశవాళీ టో ర్నీల్లో ఆటగాళ్లు జట్టు కోసం కాకుండా వ్యక్తి గత ప్రదర్శనపైనే దృష్టి సారిస్తు న్నా రని, దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకో వాలని కోరాడు.
వెల్లింగ్టన్, నవంబర్ 26: న్యూజి లాండ్ గడ్డపై జరిగిన తొలి టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ చేదు అనుభవం ఎదురైంది. స్కోర్ బోర్డు వద్ద ఓ ప్రేక్షకుడు జోఫ్రా పై జాత్యాంహకార వ్యాఖ్యలు చేశాడు. దీంతో జోఫ్రా విషయాన్ని తమ క్రికెట్ బోర్డుకు తెలియజేయడం తో విషయం బయటికి వచ్చింది. దీనిపై స్పందించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జోఫ్రాకు బహిరంగ క్షమాప ణలు చెప్పింది.
బ్రిస్బేన్స్, నవంబర్ 26: డొమెస్టిక్ వనే్డ కప్లో భాగంగా మంగళవారం జరిగిన ఫైనల్లో క్వీన్స్లాండ్ జట్టుపై వెస్టర్న్ ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన క్వీన్స్లాండ్ జట్టు 205 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ జిమీ పెయర్సన్ (79) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.