S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/08/2020 - 04:45

ముంబయి, మార్చి 7: సచిన్ తెండూల్కర్, వినోద్ కాంబ్లి వంటి మేటి ఆటగాళ్లతో పోల్చతగ్గ బ్యాటింగ్ నైపుణ్యంతో, దేశవాళీ క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వసీం జాఫర్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 42 ఏళ్ల జాఫర్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ, భవిష్యత్తులో కోచ్‌గా లేదా కామెంటేటర్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని వ్యాఖ్యానించాడు.

03/08/2020 - 04:43

అమ్మాన్ (జోర్డాన్), మార్చి 7: ఇక్కడ జరుగుతున్న ఒలింపిక్స్ బాక్సింగ్ క్వాలిఫయర్స్‌లో భారత బాక్సర్ అమిత్ పంగల్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మంగోలియాకు చెందిన ఎకామనడాక్ ఖర్ఖూపై అతను అత్యంత కష్టం మీద గెలుపొందాడు. న్యాయ నిర్ణేతల నిర్ణయం అమిత్‌కు అనుకూలంగా మూడు, వ్యతిరేకంగా రెండు చొప్పున వెలువడింది.

03/08/2020 - 04:40

మెల్బోర్న్, మార్చి 7: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ గాయం కారణంగా ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచ కప్ ఫైనల్లో ఆడలేకపోతున్నది. ఆమెకు త్వరలోనే శస్త్ర చికిత్స జరగనుంది. ఫలితంగా ఆరు నెలల పాటు ఆమె క్రికెట్‌కు దూరమవుతుంది. న్యూజిలాండ్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో, ఫీల్డ్ చేసిన బంతిని విసరే క్రమంలో ఎలిస్ కుడికాలు కండరాలు బెణికాయి. దీనితో ఆమెను వైద్య పరీక్షలకు తరలించారు.

03/06/2020 - 00:59

సిడ్నీ: అంతా అనుకున్నట్లే జరిగింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ఇంగ్లాండ్‌తో జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో గ్రూప్ మ్యాచు ల్లో పాయింట్ల ఆధారంగా టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే మ్యాచ్‌కు ప్రారంభం ముందు నుంచే సిడ్నీలో భారీ వర్షం పడడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యపడ లేదు.

03/05/2020 - 23:42

సిడ్నీ, మార్చి 5: మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఆరోసారి ఫైనల్‌కు చేరింది. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయాస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కాగా, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయ 134 పరుగులు చేసింది.

03/04/2020 - 23:57

ముంబయి: బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ సునీల్ జోషీ ఎంపికయ్యాడు. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సునీల్ జోషీ పేరును బీసీసీఐకి సిఫార్సు చేసింది. బుధవారం సమావేశమైన సీఏసీ సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూలు చేసింది.

03/04/2020 - 23:55

సిడ్నీ, మార్చి 4: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగే సెమీ ఫైనల్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌ను ఢీకొనబోతుంది. టోర్నీలో ఇప్పటివరకు ఓటమి చూడని భార త్, బలమైన జట్టుతో తలపడనుండడంతో ఈ మ్యాచ్‌పై అంద రి దృష్టి పడింది. ఇంగ్లాండ్ సైతం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యా చ్ మినహా గ్రూప్ బీ నుంచి మిగతా అన్నింట్లోనూ విజయం సాధించింది.

03/04/2020 - 23:53

న్యూఢిల్లీ, మార్చి 4: ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 13వ సీజన్‌కు బీసీసీఐ కఠిన నిర్ణయం తీసు కుంది. మరికొద్ది రోజుల్లో టోర్నీ ప్రా రంభం కానున్న నేపథ్యంలో ఫ్రైజ్ మ నీని భారీగా తగ్గించింది. గతంలో చాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ. 20 కోట్లు ఫ్రైజ్ మనీగా అందిం చేంది. కానీ ఈ సీజన్‌కు ఫ్రైజ్‌మనీని రూ.10 కోట్లకు తగ్గించింది.

03/04/2020 - 23:52

రాజ్‌కోట్, మార్చి 4: రంజీట్రోఫీ సెమీ ఫైనల్‌లో గుజరాత్‌పై సౌరాష్ట్ర జట్టు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఓవర్ నైట్ స్కోర్ 9/1 పరుగులతో చివరి రోజు బుధవారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన గుజరాత్ 234 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్, వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ (93), చిరాగ్ గాంధీలు త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోగా, మిగతా బ్యాట్స్‌మెన్లం తా పూర్తిగా విఫలమయ్యారు.

,
03/04/2020 - 23:51

*చిత్రాలు.. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం వద్ద అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
*భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి కోసం ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన ఇంటర్వ్యూకు హాజరైన మాజీ క్రికెటర్లు సునీల్ జోషీ, హర్వీందర్ సింగ్, రాజేష్ చౌహాన్, వెంకటేశ్ ప్రసాద్.

Pages