S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/15/2020 - 05:34

రోమ్: ఫ్లొరెంటినా ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు మహమ్మారి కరోనా వైరస్ సోకింది. వీరిద్దరికీ జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్టు అధికారులు ధృవీకరించారు. ఈ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇటలీ ఫార్వర్డ్ ఆటగాడు పాట్రిక్ కట్రోన్, అర్జెంటీనాకు చెందిన డిఫెండర్ జెర్మాయిన్ పెజెల్లాకు కరోనా వైరస్ సోకిందని జట్టు ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

03/15/2020 - 05:33

న్యూఢిల్లీ, మార్చి 14: ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, కరోనా వైరస్‌పై పోరాటం సాగించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు. వైరస్ సోకకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అతను ట్వీట్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే నాలుగు వేల మందికిపైగా మృతి చెందగా, భారత్‌లో ఇప్పటి వరకూ 80 పాజిటిక్ కేసులు నమోదయ్యాయి.

03/15/2020 - 05:31

బర్మింహామ్‌లో జరుగుతున్న ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో లీ జీ జియాపై అద్భుతమైన స్మాష్ షాట్‌ను సంధిస్తున్న ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్. అతను 17-21, 21-13, 21-19 ఆధిక్యంతో విజయం సాధించి ఫైనల్ చేరాడు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ చెన్ యూ ఫెయ్ 21-14, 23-21 తేడాతో నజోమీ ఒకుహరాను ఓడించి ఫైనల్లో చోటు దక్కించుకుంది

03/15/2020 - 05:29

మార్గావ్, మార్చి 14: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఏటీకే కైవసం చేసుకుంది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా మిగతా టోర్నీలు, సిరీస్‌లను వాయదా వేసిన అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) శనివారం నాటి ఐఎస్‌ఎల్ ఫైనల్‌ను ఖాళీ స్టే డియంలో నిర్వహించింది.

03/13/2020 - 05:55

భారత్-దక్షిణాఫ్రికా మధ్య గురువారం ధర్మశాల వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆటగాళ్ల ప్రాక్టీస్ అనంతరం కుండపోతగా వర్షం రావడంతో సిబ్బంది మైదానమంతా కవర్లను కప్పి ఉంచారు. కొద్దిసేపటికే వర్షం తగ్గగా, అంపైర్లు మైదానాన్ని పరిశీలించేలోగా మళ్లీ వర్షం జోరందుకుంది. ఇలా పలుమార్లు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

03/13/2020 - 05:52

మెల్‌బోర్న్: ఇటీవలే ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ మ్యాచ్‌లో కరోనా బాధితుడు ఉన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి నార్తన్‌స్టాండ్ లెవల్ 2 ఎన్ 47 వరుసలో కూర్చున్నట్లు గుర్తించామని మెల్‌బోర్న్ క్రికెట్ మైదానం అధికారులు వెల్లడించారు.

03/13/2020 - 05:51

న్యూఢిల్లీ/ధర్మశాల, మార్చి 12: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై నీలినీడలు కమ్ము కున్నాయ. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఐపీఎల్‌పై తన వైఖరిని స్పష్టం చేసినా, నిర్వహణ సందే హంగా మారింది. మరోవైపు భారత ప్రభుత్వం వీసా నిబంధనలపై కఠినమైన ఆ ంక్షలను విధించ డం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది.

03/13/2020 - 05:48

టోక్యో, మార్చి 12: ఓవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా టోక్యో ఒలింపిక్స్ 2020 యథావిధిగా నిర్వహిస్తామని టోక్యో గవర్నర్ యురికో కొయ్యె స్పష్టం చేశారు. కరోనాతో జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు అక్కడ జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ అనుమానంగా మారిన పరిస్థితుల్లో తాజాగా టోక్యో గవర్నర్ ఈ విషయా న్ని వెల్లడించారు. ఒలింపిక్స్ క్రీడల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశాడు.

03/13/2020 - 05:45

రాజ్‌కోట్, మార్చి 12: రంజీట్రోఫీ లో భాగంగా సౌరాష్ట్ర-బెంగాల్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ ఆసక్తి కరంగా సాగుతోంది. నాలుగో రోజు గురువారం ఓవర్ నైట్ స్కోర్ 134/3 తో మొదటి ఇన్నింగ్స్‌కు దిగిన బెం గాల్ ఆటగాళ్లు ఆక్టుకున్నారు. సుదీప్ ఛటర్జీ (81) త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోగా, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (64), అంత్సుప్ మజుందార్ (58, నాటౌట్) అర్ధ సెంచ రీలతో ఆకట్టుకున్నారు.

03/12/2020 - 01:26

ధర్మశాల: న్యూజిలాండ్ పర్యటన అనంతరం కోహ్లీ సేన స్వదేశంలో నేటి నుంచి సఫారీలను ఢీకొనబోతోంది. గత పర్యటనలో చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వకుం డా, జట్టును మళ్లీ గాడిన పడేయాలని టీమిండియా భావిస్తుం డగా, దక్షిణాఫ్రికా ఆత్మవి శ్వాసంతో బరిలోకి దిగుతోం ది. ఇటీ వల స్వదేశంలో కంగారులను 3-0 తేడాతో మట్టి కరిపించింది. మరోవైపు సీనియర్ ఆటగాడు డుప్లెసిస్ జట్టులోకి చేరడం సఫారీలకు కొండంత బలం చేకూరినట్లయంది.

Pages