S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/18/2020 - 23:29

న్యూఢిల్లీ, మార్చి 18: క్రీడాకారుల ఆరోగ్య భద్రత కంటే డబ్బే ప్రధానమా అంటూ ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అధికారులపై భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ విరుచుకుపడింది. ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను వాయిదా వేయకుండా కొనసాగించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ ప్రపంచంలోని పలు ప్రాంతాలతోపాటు యూకేలోనూ వ్యాపించిన విషయాన్ని ఆమె తన ట్విట్టర్ మాధ్యమంగా ప్రస్తావించింది.

03/18/2020 - 23:26

లండన్, మార్చి 18: అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో అనిశ్చిత వాతావరణం కొనసాగుతున్నది. కరోనా వైరస్ యూరోప్‌ను కూడా భయాందోళనకు గురిచేస్తున్న తరుణంలో ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డు (ఈడబ్ల్యూసీ) అన్ని రకాల పోటీలను నిరవధికంగా వాయిదా వేసింది. ఇంగ్లీష్ కౌంటీలు కూడా వాయిదా పడ్డాయి. సహజంగా ప్రతి ఏడాది ఈ సీజన్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంటుంది.

03/18/2020 - 23:25

జోహానె్నస్‌బర్గ్, మార్చి 18: దక్షిణాఫ్రికా క్రికెటర్లు తమంతట తామే స్వచ్ఛందంగా ఏకాంతంలోకి వెళ్లిపోయారు. భారత పర్యటన కరోనా వైరస్ కారణంగా అర్ధంతంగా నిలిచిపోవడంతో స్వదేశానికి తిరిగివచ్చిన దక్షిణాఫ్రికా జాతీయ జట్టు క్రికెటర్లంతా ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు సమాచారం. భారత్‌తో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.

03/18/2020 - 00:01

టోక్యో: జపాన్ ఒలిపిక్ కమిటీ డిప్యూటీ చీఫ్ కొజో తషిమాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తషిమాకు వైరస్ సోకిందన్న వార్తతో యావత్ క్రీడారంగం దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఉంటుందా లేక వాయిదా పడుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

03/18/2020 - 00:00

కరాచీ, మార్చి 17: పాకిస్తాన్ సూపర్ లీగ్ నాకౌట్ దశ పోటీలు వాయిదా పడ్డాయి. ఒక విదేశీ ఆటగాడికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. అయితే, ఆ విదేశీ ఆటగాడు ఎవరన్నది వెల్లడించలేదు. కానీ, పాకిస్తాన్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ రమీజ్ రాజా మాత్రం ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హాలెస్ పేరును ప్రకటించాడు.

03/17/2020 - 23:58

బెర్లింగ్, మార్చి 17: కరోనా వైరస్ కారణంగా వివిధ క్రీడా టోర్నీలు, సిరీస్‌లు మాత్రమేగాక, ట్రైనింగ్ సెషన్లు కూడా వాయిదా పడుతున్నాయి. తాజాగా బయెర్న్ మ్యూనిచ్, డార్ట్‌మండ్ ఫుట్‌బాల్ జట్లు ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేశాయి. డార్ట్‌మండ్ తన ఆటగాళ్లకు ఓ వారం విశ్రాంతి ప్రకటించింది. తమతమ ఇళ్లకు వెళ్లాల్సిందిగా సూచించింది.

03/17/2020 - 23:58

కోల్‌కతా, మార్చి 17: కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని బెంగాల్ క్రికెట్ సంఘం (కాబ్) అధికారులు కూడా సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించారు. చాలా వరకు ఐటీ కంపెనీలు, ఇతర బహుళజాతి సంస్థలు, పలు కార్పొరేట్ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ వెసులు బాటును కల్పించారు.

03/17/2020 - 23:56

టోక్యో, మార్చి 17: టోక్యో ఒలింపిక్స్ క్రీడా జ్యోతి రిలే నిడివిని కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జపాన్ ఒలింపిక్ కమిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్గాన్ని సాధ్యమైనంత వరకూ కుదించేందుకు ప్రయత్నిస్తామని వారు ప్రకటించారు. అయితే, రిలేను సాధారణ ప్రజలు తిలకించవచ్చని పేర్కొన్నారు. రిలే రూట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని వారు తెలిపారు.

03/17/2020 - 06:08

టీమిండియాతో సిరీస్‌కు సందర్భంగా భారత్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు సోమవారం కోల్‌కతాకు చేరుకున్నారు. మంగళవారం క్రికెటర్లు ఇక్కడి నుంచే తిరిగి స్వదేశానికి బయల్దేరనున్నారు. అయతే కరోనా వైరస్ కారణంగా టీమిండియాతో జరగాల్సిన సిరీస్ రద్దయన విషయం తెలిసిందే.

03/17/2020 - 06:06

ముంబయి, మార్చి 16: కరోనా వైరస్ కలకలంతో ఓవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వాయిదా వేయగా, మరోవైపు దేశవాళీ టోర్నీలన్నింటినీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మంగళవారం నుంచి బీసీసీఐ కార్యాల యాన్ని మూసివేస్తున్నట్లు సమాచారం.

Pages