S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/03/2018 - 04:27

మేడ్చల్, మార్చి 2: తనకు తన భర్తకు పంచాయతీ కోర్టులో పోలీసుస్టేషన్‌లో నడుస్తుండగానే తన భర్త మరో మహిళను వివాహం చేసుకుని కాపురం చేస్తున్నాడని ఒక మహిళ మేడ్చల్ పోలీసులను ఆశ్రయించింది. ఆధారాల సేకరణ కోసం భర్త ఉంటున్న గదిలోకి వెళ్లడంతో పరస్పరం ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

03/03/2018 - 04:08

ఒంగోలు, మార్చి 2: ఇటీవల ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ క్వార్టర్స్‌లోని ఐదు ఇళ్లల్లో జరిగిన దొంగతనం కేసులను ఒంగోలు పోలీసులు ఛేదించినట్లు ఎస్‌పి సత్య ఏసుబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఎస్‌పి సత్య ఏసుబాబు మాట్లాడుతూ ఈ కేసుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు గజ దొంగలను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

03/03/2018 - 03:59

గుంతకల్లురూరల్, మార్చి 2 : మండలంలోని నక్కనదొడ్డి గ్రామ సమీపంలో ఉన్న దర్గా వద్ద శుక్రవారం వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. నక్కనదొడ్డి దర్గా సమీపంలో రోడ్డు మార్గంలో వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తిని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తించిన స్థానికులు 108 వాహనానికి ద్వారా వైద్యం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

03/03/2018 - 03:55

కాల్వశ్రీరాంపూర్, మార్చి 2: పరీక్షలో ఫెయిల్ అవుతానేమోననే బెంగతో ఇంటర్ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆరెపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆరెపల్లి గ్రామానికి చెందిన గీరం సాగరిక (18) మండలంలోని మల్యాల మోడల్ స్కూళ్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది.

03/03/2018 - 03:54

చందుర్తి, మార్చి 2: చందుర్తి మండలం రాంరావుపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి లింగయ్య (50) అనే వ్యక్తిని ఇదే గ్రామానికి చెందిన లింగంపల్లి రాజయ్య అతని కుమారుడు వెంకటేష్‌తో పాటు మరికొందరు శుక్రవారం రాత్రి కర్రలు, గొడ్డలితో దాడి చేయగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.

03/03/2018 - 03:51

మంచిర్యాల, మార్చి 2: మంచిర్యాల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర్ మెటల్ స్టోర్స్‌లో 14 రోజుల క్రితం జరిగిన చోరీ కేసులో ఆరుగురు నిందితులను పట్టుకోని వారి నుంచి రూ. 2,02,130 తో పాటు మోటర్ సైకిల్‌ను స్వాధీన పరుచుకున్నట్లు గా పట్టణ సీ ఐ ఎడ్ల మహేష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొంగ తనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

03/03/2018 - 03:39

ఇందూర్, మార్చి 2: హోళీ వేడుకల్లో అపశృతి దొర్లింది. ఈ సంఘటన ఎడపల్లి మండలం జానకంపేట్ శివార్లలోని నిజాంసాగర్ కెనాల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామానికి అబీద్(22)అనే యువకుడు తన బావ, స్నేహితులతో కలిసి శుక్రవారం ఆ గ్రామంలో జరిగిన హోళీ వేడుకల్లో పాల్గొన్నారు.

03/03/2018 - 03:34

కనగల్, మార్చి 2: మండలంలోని దర్వేశీపురం గ్రామంలో వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దర్వేశీపురం గ్రామానికి చెందిన కంచెరకుంట నర్సమ్మ (65)అనే వృద్ధురాలు శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద కమ్మల గుడిసెను అద్దెకిస్తూ జీవనం సాగిస్తుంది. గురువారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నర్సమ్మను బండ రాళ్లతో కట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నర్సమ్మకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

03/03/2018 - 03:25

విశాఖపట్నం, మార్చి 2: కౌలాలంపూర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి వారు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం కౌలాలంపూర్ నుంచి ఈనెల ఒకటో తేదీన పల్లి శ్రీనివాసరావు విశాఖకు చేరుకున్నాడు. అతని బ్యాగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.

03/03/2018 - 02:41

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణ పబ్లిక్ సర్వీసుకమిషన్ ఫారెస్టు బీట్ ఆఫీసర్ల పోస్టులకు సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను ఎనిమిది వారాల పాటు వెల్లడించరాదని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆర్ రఘుపతి రెడ్డి అనే పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ కేసులో పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Pages