క్రైమ్/లీగల్

వృద్ధురాలి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనగల్, మార్చి 2: మండలంలోని దర్వేశీపురం గ్రామంలో వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దర్వేశీపురం గ్రామానికి చెందిన కంచెరకుంట నర్సమ్మ (65)అనే వృద్ధురాలు శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద కమ్మల గుడిసెను అద్దెకిస్తూ జీవనం సాగిస్తుంది. గురువారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నర్సమ్మను బండ రాళ్లతో కట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నర్సమ్మకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తె సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ నర్సింహులుగౌడ్ తెలిపారు.
బ్యాంక్‌లో జేబుదొంగల చేతివాటం
మోత్కూర్, మార్చి 2: మండల కేంద్రంలోని ఎస్‌బీఐలో జేబుదొంగల చేతివాటంతో మోత్కూర్‌కు చెందిన పురుగుల సారయ్య 11,410 రూపాయలను పోగొట్టుకున్నట్లు బాధితుడు శుక్రవారం తెలిపారు. సారయ్య గొర్రెల యూనిట్ల కోసం రూ.31,410లను డీడీ తీసేందుకు బ్యాంక్ కౌంటర్‌లో వరుసలో నిలబడగా సారయ్య షర్టు జేబులో పెట్టుకున్న రూ.11,410లను దొంగ చేతివాటం ప్రదర్శించడంతో పోగొట్టుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించగా మాకు ఎటువంటి సంబంధం లేదని, సీసీ కెమెరాలు ఏర్పాటుచేసింది మీకోసం కాదని మేనేజర్ అన్నట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మేనేజర్‌తో వాగ్వివాదానికి దిగగా, ఆ సమయంలో సీసీ కెమెరాలు పని చేయలేదని, మాకెటువంటి సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ చేతులు దులుపుకున్నట్లు బాధితుడు తెలిపారు. సారయ్య చేసేదేమీ లేక బ్యాంకు నుండి వెనుదిరిగి వెళ్లాడు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సారయ్య తెలిపారు.