S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/27/2018 - 04:33

పుత్తూరు, ఫిబ్రవరి 26: చిత్తూరు జిల్లా నారాయణ వనం మండల కేంద్రానికి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ముందువెళుతున్న లారీని అధిగమించడానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ చేసిన ప్రయత్నంలో ఎదురుగావస్తున్న కారును ఢీకొన్నాడు. ఈ ఘటనలో నవ వధువు సహా ముగ్గురు మృతి చెందగా, నవ వరుడు సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

02/27/2018 - 02:47

హైదరాబాద్, ఫిబ్రవరి 26: ఎల్ అండ్ టి మెట్రో రైల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ అమాయకుల నుంచి డబ్బు దండుకుని మోసం చేసిన నలుగురిని టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకుని, రూ.14.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అనిత, విజితా రెడ్డి స్నేహితులు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఉద్యోగాలిప్పిస్తామని అమాయకులకు నచ్చజెప్పి డబ్బు వసూలు చేయాలని పథకం రచించారు.

02/27/2018 - 02:30

ఉప్పల్, ఫిబ్రవరి 26: వారు ముగ్గురు స్నేహితులు. కల్సిమెల్సి ఉంటూ ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. బయట పనిపై వెళ్లిన వారు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషాధ సంఘటన ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే..

02/27/2018 - 00:21

చీరాల, ఫిబ్రవరి 26 : ఏటీఎం కార్డు దొంగిలించి బ్యాంకు ఖాతాలో సొమ్ము అపహరించిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు, స్థానిక విజిలీపేటకు చెందిన రత్నకుమార్ తన ఏటీఎం కార్డు దొంగతనం జరిగిందని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగిలించిన ఏటీఎం కార్డును ఉపయోగించి తన ఎస్‌బిఐ ఖాతాలోని రూ.1.5 లక్షలు డ్రా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

02/27/2018 - 00:05

ఆత్మకూరు, ఫిబ్రవరి 26:ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన కేసులో భార్య, ప్రియుడు, అతడికి సహకరించిన వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. అందుకు సంబంధించి సోమవారం డీఎస్పీ మాధవరెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

02/26/2018 - 23:56

మణుగూరు, ఫిబ్రవరి 26: భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో సోమవారం జరిగిన ప్రమాదంలో మరో కార్మికుడు మృతి చెందాడు. ప్రమాదంపై తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం బీటీపీఎస్‌లో ఎలక్ట్రో స్త్రాస్పపిక్ ప్రాస్పిటేటర్ (ఈఎస్‌పీ)ను సబ్ కాంట్రాక్టు కంపెనీ అయిన హార్జీ అనే సంస్థ నిర్వహిస్తోంది.

02/26/2018 - 23:54

సత్తుపల్లి, ఫిబ్రవరి 26: ఒకదానికొకటి వరుసగా మూడు లారీలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయాలతో బయటపడిన సంఘటన సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగింది. సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వైపు బొగ్గులోడ్‌తో వెళ్తున్న టిప్పర్ కిష్టారం బిఇడి కళాశాల సమీపంలో రోడ్డుపక్క లారీ నిలిపి ఉండటంతో దానిని ఖ్రాస్ చేయబోగా ఎదురుగా మరో ఖాళీ బొగ్గుటిప్పర్ వచ్చి ఢీకొట్టింది.

02/26/2018 - 23:51

కామేపల్లి, ఫిబ్రవరి 26: ఆర్థిక బాధలు తాళలేక పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. సంఘటనకు గల వివరాలు ఇలా ఉన్నాయి. కామేపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య అనే వ్యవసాయ కూలీ గ్రామంలో కూలీ పనులు చేస్తున్నాడు.

02/26/2018 - 23:22

పుత్తూరు, ఫిబ్రవరి 26: ముందువెళుతున్న లారీని అధిగమించేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ చేసిన ప్రయత్నంలో ఎదురుగావస్తున్న కారును ఢీకొన్న సంఘటనలో నవ వధువు సహా ముగ్గురు మృతి చెందగా, నవ వరుడు సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

02/26/2018 - 22:25

పొన్నూరు, ఫిబ్రవరి 26: నిడుబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం రైలుపట్టాలు దాటుతున్న ఓ మహిళను రైలు ఢీకొనడటంతో దుర్మరణం చెందింది. స్థానికుల కథనం ప్రకారం... గుర్తు తెలియని ఓ మహిళ సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో రైలు పట్టాలు దాటుతుండగా స్టేషన్ నుంచి చెన్నై వైపు వెళ్తున్న రైలు ఆమెను ఢీకొంది. దీంతో ఆమె కాళ్లూ, మొండెం వేరై దుర్మరణం చెందింది. మృతురాలు తెల్లరంగు పంజాబీ డ్రస్ ధరించి ఉంది.

Pages