క్రైమ్/లీగల్

హోళీ వేడుకల్లో అపశృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, మార్చి 2: హోళీ వేడుకల్లో అపశృతి దొర్లింది. ఈ సంఘటన ఎడపల్లి మండలం జానకంపేట్ శివార్లలోని నిజాంసాగర్ కెనాల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామానికి అబీద్(22)అనే యువకుడు తన బావ, స్నేహితులతో కలిసి శుక్రవారం ఆ గ్రామంలో జరిగిన హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఎడపల్లి మండలం జానకంపేట్ శివార్లలో శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం కింది భాగంలో నిజాంసాగర్ ప్రధాన కాల్వనిండుగా పారుతుండటంతో అందులో స్నానం చేసేందుకు 10మంది యువకులు ఆటోరిక్షాలో వచ్చారని ఎడపల్లి పోలీసులు తెలిపారు. యువకులంతా నిజాంసాగర్ కాల్వలో స్నానం చేస్తుండగా, అబీద్ నీటిలో మునిగిపోవడంతో అతడితో వచ్చిన మృతుడి బావ సలీంతో పాటు స్నేహితులు కన్నీటి పర్యాంతమయ్యారు. అప్పటి వరకు కుల, మతాలకు అతీతంగా హోలీ వేడుకల్లో ఆనందోత్సవాల మధ్య జరుపుకున్న యువకులు ఒక్కసారిగా దుఖఃసాగరంలో మునిగిపోయారు. కాల్వలో నీటి విడుదలను నిలిపివేసి గాలించగా, సుమారు గంటన్నర తర్వాత అబీద్ మృతదేహం లభ్యమైంది. శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించడం జరిగిందని ఎడపల్లి పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి అలీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎడపల్లి పోలీసులు తెలిపారు.