S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/31/2015 - 08:10

హైదరాబాద్, డిసెంబర్ 30: శాసన మండలి ఎన్నికల్లో ఆరు స్థానాలకు పోటీ జరిగితే నాలుగు స్థానాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు, శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఫలితాలు ప్రకటించగానే జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లోను, ఇటు తెలంగాణ భవన్‌లోను బాణాసంచా కాల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. తాము ఊహించినట్టుగానే ఫలితాలు వచ్చాయని టిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.

12/31/2015 - 08:07

హైదరాబాద్, డిసెంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో సివిల్ సర్వీస్ కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. బుధవారం ఆయన బిసి సంక్షేమంపై సమీక్షించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ, బిసి స్టడీ సర్కిల్స్‌కు సొంత భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు.

12/31/2015 - 07:57

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 30: ఉదయానే్న ఉత్సాహంగా పాఠశాలకు బయలుదేరిన విద్యార్థులను లారీ, డిసిఎం రూపంలో ఢీకొన్న ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడిన సంఘటన బుధవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివలింగం కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కంది శివారులోని కేశవరెడ్డి పాఠశాలకు చెందిన బస్సు ఉదయం పటాన్‌చెరు ప్రాంతం నుంచి విద్యార్థులను తీసుకొని పాఠశాలకు బయలుదేరింది.

12/31/2015 - 07:57

హైదరాబాద్, డిసెంబర్ 30: శాసనమండలి ఎన్నికల్లో ఆరు సీట్లను ఏకగ్రీవంగా, నాలుగు సీట్లను పోటీలో గెలిచినందుకు టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావులో ఆనందం లేదు. దక్షిణ తెలంగాణలోని కీలకమైన మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మూడు స్ధానిక సంస్థల మండలి ఎన్నికల్లో రెండు స్ధానాలను పొగొట్టుకున్నందుకు కెసిఆర్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

12/31/2015 - 07:56

నల్లగొండ, డిసెంబర్ 30: నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ప్రత్యర్ధి టిఆర్‌ఎస్ అభ్యర్ధి తేరా చిన్నపరెడ్డిపై 193 ఓట్లతో విజయం సాధించారు. జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఓట్ల లెక్కిం పు కార్యక్రమం ప్రారంభం నుండి కూడా రాజగోపాల్‌రెడ్డి ఆధిక్యతలో కొనసాగారు.

12/31/2015 - 07:37

హైదరాబాద్, డిసెంబర్ 30: ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పిలుపు వచ్చింది. యూనివర్సిటీ నిర్వహించే సదస్సులో ప్రసంగించాలని ఆయనను ఆహ్వానించింది. ‘డిజిటల్ ఇండియా ఆలోచనల నేపథ్యంలో స్టార్టప్‌ల భవిష్యత్తు’, ‘సాంకేతిక విప్లవం నేపథ్యంలో దేశ సమగ్రాభివృద్ధి’ అనే రెండు అంశాలపై కెటిఆర్ ప్రసంగిస్తారు.

12/31/2015 - 07:26

తెలంగాణ సాకారం అయిన తరువాత పండుగలను అధికారికంగా జరుపుకోవడమే కాకుండా దేశంలో ఎప్పుడూ
జరగని విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. బతుకమ్మ పండుగను కన్నుల పండువగా వారం రోజులపాటు
నిర్వహించారు. అన్ని మతాల పర్వదినాలను అధికారికంగా చేపట్టడంవల్ల ఆథ్యాత్మిక కార్యక్రమాలకు ఊహించని
విధంగా అన్ని మాతాల నుంచి సానుకూల ధోరణి వ్యక్తమైంది. యాదగిరి గుట్టను దాదాపు వెయ్యి ఎకరాల్లో

12/31/2015 - 06:11

హైదరాబాద్‌లో శీతాకాల విడిది ముగిసిన సందర్భంగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం సాయంత్రం ఇచ్చిన తేనీటి విందులో ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, సిఎం కె చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు

12/31/2015 - 06:02

హైదరాబాద్, డిసెంబర్ 30: గత ఏడాదితో పోల్చుకుంటే చైన్ స్నాచింగ్‌లు, వరకట్న వేధింపుల కేసులు తగ్గుముఖం పట్టాయి. మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, దోపిడీలు పెరిగాయి. వామపక్ష తీవ్రవాదం ఉనికి లేకుండా చేశాం. గట్టి నిఘా వేసి తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశాం. రాష్ట్రంలో ఉగ్రవాద సానుభూతిపరులు పెరుగకుండా కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నాం. ఉగ్రవాదంపై రాజీ ప్రసక్తేలేదు. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని అణచివేస్తాం.

12/31/2015 - 06:01

హైదరాబాద్, డిసెంబర్ 30: రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం బృహత్ ప్రణాళిక రూపొందించడానికి శ్రీకారం చుట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు కదిలిన ప్రభుత్వం వివిధ వర్గాల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకునేందుకు బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించింది.

Pages