-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
బాసర: దక్షిణభారతదేశంలోని ఏకైక చదువుల తల్లి నిలయమైన ఆదిలాబాద్ జిల్లా బాసర శ్రీ జ్ఞానసరస్వతిదేవి నిలయంలో వసంత పంచమి ఉత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. శనివారం సైతం భక్తులు బాసర క్షేత్రానికి పోటెత్తారు.
వరంగల్: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది.
మహబూబ్నగర్: ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని, అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లాకే దాదాపు రూ.6880 కోట్లు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామని, పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.
చర్ల: ఖమ్మం జిల్లా చర్ల మండల పరిధిలోని కోర్కట్పాడు అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం సీపీఐ మావోయిస్టు వెంకటాపురం ఏరియా కమిటీ కొండెవాయి (ఆర్పీసీ) మిలీషియా కమాండర్ను అరెస్టు చేసినట్లు వెంకటాపురం సీఐ సాయిరమణ తెలిపారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా చింతగుప్ప అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఇవిఎం)ను తెలంగాణ రాష్ట్ర సమితి టాంపరింగ్ చేయడంపై తాము న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: బలహీన వర్గాలు, ఎస్సి, ఎస్టి కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి నిధుల కేటాయింపును భారీగా పెంచారు. ప్ర స్తుతం చెల్లిస్తున్న రూ. 3 లక్షల మొ త్తాన్ని ఇప్పుడు రూ. 10 లక్షలకు పెం చుతూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కామన్ గుడ్ ఫండ్కు వంద కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించారు. పనిలోపనిగా చారిత్రాత్మక, పురాతన ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు.
హైదరాబాద్, : హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం భూసేకరణ ప్రక్రియ చేపట్టకుండా స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. భూ సేకరణలో భాగంగా తమ భవనంలో కొంత భాగాన్ని సేకరించాలన్న ప్రభుత్వ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ ట్రాన్స్ట్రాయ్ ఇండియా సంస్ధ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఏ చిన్న సంఘటనకూ తావులేకుండా ప్రశాంతంగా ముగిసింది. ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణంతో నిర్వహించిన ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదు అయ్యంది. దాదాపు 82 శాతం పోలింగ్ నమోదు కావడంతో, పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలమన్న లెక్కల్లో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయ. పరిస్థితిని చూస్తే, అధికార తెరాస దూకుడు కనిపించిందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో మూడు వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసేందుకు చైనా హునాన్ ప్రావెన్సీ ముందుకు వచ్చింది. ముంభైలో శనివారం ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో హునాన్ ఈ ప్రతిపాదన చేసింది. 2500 నుంచి 3000వేల ఎకరాల భూమి కావాలని, వీటిలో వివిధ విభాగాలకు చెందిన పరిశ్రమలు స్థాపించనున్నట్టు హునాన్ ప్రతినిధి బృందం తెలిపింది.
హైదరాబాద్: టిఆర్ఎస్లో చేరిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఇప్పటికే దాఖలైన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలా? లేక వారు విలీనాన్ని కోరుతూ ఇచ్చిన లేఖపై నిర్ణయం తీసుకోవాలా? అనేది రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ముందు ప్రధాన సవాల్. టిడిపి ఎమ్మెల్యేలు 10 మంది టిఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారు స్పీకర్కు లేఖ అందజేశారు.