-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 14: మహానగర పాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్ బోసలెను ఆదివారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. నగర నూతన మేయర్గా ఎన్నికైన సందర్భంగా ఆయన చీఫ్ జస్టిస్కు పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా జస్టిస్ దిలీప్ బోసలే మేయర్ రామ్మోహన్ను ప్రశంసిస్తూ మీ హయాంలో గ్రేటర్ హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణ తెలుగు దేశం పార్టీకి కష్టకాలం వచ్చింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. పార్టీ ఇటువంటి ఆటుపోట్లను ఎన్నో తట్టుకుని నిలబడిందని, కార్యకర్తలు అధైర్యపడవద్దని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధైర్యం నూరిపోసేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 14: హైదరాబాద్ నగర శివారుల్లో ఉన్న కాందిశీకులు (ఇక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్లిన వారి) ఎవాక్యూ భూములు రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయని హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది.
న్యూదిల్లి:జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో అఫ్జల్గురు అనుకూల చర్యలు, భారత వ్యతిరేక నినాదాలు చేసిన సంఘటనల వెనుక లష్కరేతోయిబా అధినేత హఫీజ్ మద్దతు ఉందని కేంద్ర హోంమంత్రి ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు దేశం అంతా ఒకే వాణి విన్పించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారంనాడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నాలుగు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగవచ్చు. ఖమ్మంలో మొదట అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం రామదాసు, శ్రీరామ పథకాల పనులను ఆయన ప్రారంభిస్తారు. కాగా మూడురోజులుగా దిల్లీలో బిజీబిజీగా గడిపిన కెసిఆర్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్కు పయనమయ్యారు.
నిజామాబాద్:కుటుంబ కలహాలు ముగ్గురి ప్రాణాలు తీశాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వెంకటప్పాడు తాండాలో ఓ మహిళ తన ఐదేళ్ల కుమారుడు, ఎనిమిదినెలల కుమార్తెకు ఉరివేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనతో గ్రామం విస్తుబోయింది. కుటుంబంలో జరిగిన గొడవలే దీనికి కారణమని భావిస్తున్నారు.
నల్గొండ:సినీనటి ప్రణీత పెద్దప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తాపడగా సీటు బెల్టుకోవడంతో స్వల్పగాయాలతో బైటపడ్డారు. ఖమ్మంలో ఓ షాపింగ్మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని ఇన్నోవా కారులో తిరిగి వస్తూండగా నల్గొండ జిల్లా మోతెవద్ద ఎదురుగా వెళుతున్న మోటార్బైక్ను తప్పించే ప్రయత్నంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడింది. ఆ సమయంలో కారులో ఆమెతోపాటు తల్లి, బంధువులు ఉన్నారు.
జహీరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ద్వారా ఇస్తున్న బియ్యం, గోధుమలకు బదులు చిరుధాన్యాలను అందించాలని చట్టంలో మార్పులు తీసుకువచ్చామని సుప్రీంకోర్టు ఫుడ్ కమిషన్ ప్రిన్సిపల్ అడ్వైజర్ బిరాజ్ పట్నాయక్ అన్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్లో నెలరోజుల కిందట ప్రారంభమైన పాతపంటల జాతర శనివారం ముగిసింది.
హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజుల పాటు జరిగే సమ్మక్క, సారలమ్మల జాతరను పురస్కరించుకుని ఆ రోజులను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు లేఖ రాశారు. 1996లో ఈ జాతరను తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా గుర్తించిందని తెలిపారు.
హైదరాబాద్: దేవాదుల రీ డిజైనింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేసి సాగునీటిని అందించాలని అన్నారు. దేవాదుల ఫేజ్ 3, ప్యాకేజీ 2,3 పనుల పురోగతిపై మంత్రి సమీక్ష జరిపారు. జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలకు ఎఫ్ఎఫ్సి ద్వారా నీటి సరఫరాపై చర్చించారు.