-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
వరంగల్, ఫిబ్రవరి 12: మేడారం జాతర సందర్భంగా మేడారంలో 50 ఎకరాల్లో ఆర్టీసి తాత్కాలిక బస్టాండ్ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం వరంగల్ సర్క్యూట్ గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 నుండి మేడారంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
మంగపేట, ఫిబ్రవరి 12: వన దేవతలైన మేడారం సమ్మక్క - సారలమ్మ గద్దెల వద్ద ముందస్తు మొక్కులు కొనసాగుతున్నాయి. సారలమ్మ గద్దెపై కొలువుదీరే ఫిబ్రవరి 17 నుండి వన దేవతలు తిరిగి వన ప్రవేశం చేసే 20వ తేదీ వరకు జరగనున్న మేడారం మహా జాతరకు ఈ సంవత్సరం కోటికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో లక్షలాది మంది జాతరకు ముందే ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 12: వయోజన విద్య లక్ష్యాలను అధిగమించే దిశగా ప్రయత్నించాలని నేషనల్ లిటరసీ మిషన్ అథారిటీ (ఎన్ఎల్ఎంఏ) డిజి వైఎస్కె శేషుకుమార్ ఆ శాఖ సిబ్బందికి పిలుపునిచ్చారు. శుక్రవారం బషీర్బాగ్లోని రాజీవ్ విద్యామిషన్ కార్యాలయంలోని గోదావరి హాల్లో జరిగిన రెండు రాష్ట్రాల వయోజన విద్యా కార్యక్రమాలపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 12: స్వరాష్ట్రంలో ఉమ్మడి రాజధానిలో కొత్త మేయర్, డిప్యూటీ మేయర్లు శుక్రవారం కొలువుదీరారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం పనె్నండు గంటల నలభై నిమిషాలకు మేయర్ బొంతు రామ్మోహన్ తన ఛాంబర్లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టగా, అంతకు ముందు పదకొండున్నర గంటలకు సమయంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ బాధ్యతలు స్వీకరించారు.
ముంబై:ఐసిసి అంపైర్ ప్యానల్ సభ్యుడు, పాకిస్తాన్కు చెందిన అంపైర్ అసద్ రవూఫ్పై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలికి సంబంధం ఉన్న ఏ మ్యాచ్లోనూ ఆయన అంపైరింగ్ చేయడానికి అనుమతించరు. ఐపిఎల్-2013లో బుకీలనుంచి ఖరీదైన బహుమతులు అందుకుని అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై నియమించిన విచారణ కమిటీ ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో బీసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. నగర మేయర్గా ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యమంలో ఏవిధంగా పనిచేశామో జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం అదేవిధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
మెదక్ : నారాయణఖేడ్ నియోజకవర్గంలో రేపు ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నియోజకవర్గంలో 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఇంకుగుర్తు పెట్టే విషయంలో ఎన్నికల సంఘం స్వల్పమార్పు చేసింది. ఓటరు కుడిచేయి చూపుడు వేలుకు ఇంకుగుర్తు పెట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేసింది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా బాబా ఫసియుద్దీన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మేయర్గా బాధ్యతలు స్వీకరించేందుకు బొంతు రామ్మోహన్ జీహెచ్ఎంసీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీలో తెరాస కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హైదరాబాద్: ప్రతి ఒక్కరూ దేవునిపై నమ్మకం ఉంచాలనీ, వెంకటేశ్వర స్వామి శరణాగతి సర్వజగద్రక్ష అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ అన్నారు.
పరకాల: సమ్మక్క ఆడపడుచు లక్ష్మీదేవర (లక్ష్మిదేవమ్మ), పోతరాజు, క్రిష్ణస్వామి అంగరంగ వైభవంగా వరంగల్ జిల్లా నగరంపల్లి నుండి గురువారం మేడారానికి బయలుదేరారు. వన దేవతలు మేడారం గద్దెలకు వచ్చే ముందు లక్ష్మీదేవరమ్మను ప్రతిష్ఠిస్తామని పూజారులు తెలిపారు.