S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/13/2016 - 15:43

మెదక్: నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ స్థానానికి శనివారం పోలింగ్ సందర్భంగా ఓటర్లు ఉత్సాహవంతంగా పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు 73.5 శాతం మేరకు పోలింగ్ జరిగిందని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. టిడిపి, కాంగ్రెస్, తెరాస పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావించడంతో ఉపఎన్నిక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

02/13/2016 - 15:42

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి, తెలంగాణ సిఎం కెసిఆర్‌కు ఇపుడు అమ్ముడైపోయిన ఎమ్మెల్యేలు భవిష్యత్‌లో మంత్రి హరీష్‌రావుకు అమ్ముడుపోరన్న గ్యారంటీ ఏదీ లేదని అసెంబ్లీలో టి-టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం కుత్బుల్లాపూర్‌లో పార్టీ నేతలతో సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం వందమంది కొత్తవారికి తాము టిక్కెట్లు ఇస్తామన్నారు.

02/13/2016 - 13:56

న్యూదిల్లి:కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన పరిస్థితులు, ఐపీఎస్‌ల సంఖ్య పెంచడం, హైకోర్టు విభజనవంటి అంశాలపై వీరిద్దరూ చర్చించారు. డిజిపి అనురాగ్‌శర్మ, ఎంపి వినోద్, మంత్రి జగదీశ్వర్ కేసిఆర్‌వెంట ఉన్నారు.

02/13/2016 - 02:52

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 12: రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ (వాటర్‌గ్రిడ్) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ముఖ్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె పర్యటించారు.

02/13/2016 - 02:51

బాసర, ఫిబ్రవరి 12: ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతి దేవి నిలయంలో వసంతపంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

02/13/2016 - 02:51

హైదరాబాద్, ఫిబ్రవరి 12: చత్తీస్‌గఢ్ నుంచి అదనపు విద్యుత్‌ను ఎక్కువ మొత్తానికి కొనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు లేఖ రాశారు.

02/13/2016 - 02:50

కరీంనగర్, ఫిబ్రవరి 12: ఇంటి పనుల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే మహిళలు వీసా, పాస్‌పోర్టు, వర్క్ పర్మిట్ తదితర ధ్రువపత్రాలు సరిగా ఉంటేనే వెళ్లాలని, లేకపోతే వెళ్లవద్దని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం మహిళలకు సూచించారు.

02/13/2016 - 02:50

ఆదిలాబాద్, ఫిబ్రవరి 12: ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో సంప్రదాయబద్ధంగా సాగుతున్న ఆదివాసీల నాగోబా జాతర ఉత్సవాలు మండగాజిలి ఉత్సవాల్లో ముగిశాయి. శుక్రవారం మెస్రం వంశీయులు తమ ఆచార వ్యవహారాలతో నాగోబాకు పూర్ణాహుతి పూజలు చేసి జాతర ఉత్సవాలకు ముగింపు పలికారు. ఉదయం నుండే వివిధ ప్రాంతాల నుండి భక్తిపారవశ్యంతో తరలివచ్చిన గిరిజనం తమ ఇలవేల్పు అయిన నాగోబాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

02/13/2016 - 02:49

పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 12: ఎసిబి అధికారుల వలలో ఆరోగ్య శాఖలోని ఓ అవినీతి చేప చిక్కింది. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న హైమత్ బేగం ఎన్‌ఎంగా పనిచేస్తున్న శ్రీరాముల విజయ నుంచి పెద్దపల్లి ఆస్పత్రిలో ఐదు వేల లంచం తీసుకుంటుండగా శుక్రవారం మధ్యాహ్నం ఎసిబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు.

02/13/2016 - 02:49

హైదరాబాద్, ఫిబ్రవరి 12: వరంగల్ జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మల జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 17న సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు, వరంగల్ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్‌లో ఉదయం 9.30కి బయలుదేరి, మధ్యాహ్నం 12.45 గంటలకు వరంగల్ చేరుకుంటుంది.

Pages