S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/16/2016 - 02:00

హైదరాబాద్, ఫిబ్రవరి 15: రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ పట్టణంలోని ఆంధ్రా బ్యాంక్‌లో సోమవారం తెల్లవారు జామున చోరీ జరిగింది. దుండగులు బ్యాంకులో అమర్చిన సిసి కెమెరాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. సుమారు 60 నుంచి 70 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఒక లాకర్‌లో నాలుగు బాక్సులుంటాయి. వీటిలో ఒక బాక్స్‌ను మాత్రమే దుండగులు ఎత్తుకెళ్లినట్టు అధికారులు తెలిపారు.

02/16/2016 - 01:59

వరంగల్, ఫిబ్రవరి 15: పున్నమి వెనె్నల్లో మేడారం పులకించిపోతోంది. మహాజాతరకు ఒక రోజే సమయం ఉండడంతో భక్తులు అశేషంగా తరలివస్తున్నారు. సోమవారం దాదాపు 4 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. కాకతీయ సేనలపై కత్తి ఝుళిపించిన వీరవనితలు సమ్మక్క - సారలమ్మ జాతర కోసం కొలువుదీరే అపురూప క్షణాలు మరో 24 గంటల్లో రానున్నాయి. ఇప్పటికే సెక్టోరియల్ అధికారులు విధుల్లో చేరిపోయారు. పోలీసులు బందోబస్తు కొనసాగిస్తున్నారు.

02/16/2016 - 01:59

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో జరిగే అతి పెద్ద ఆదివాసీ జాతర ‘మేడారం సమ్మక్క, సారలమ్మల జాతరకు’ వెళ్లే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) విస్తత్ర ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

02/16/2016 - 01:58

గోవిందరావుపేట, ఫిబ్రవరి 15: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల జాతరకు కోటిన్నర మంది భక్తజనులు రానున్నారు. ఇందుకు తెలంగాణా ప్రభుత్వం 181 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టింది. తెలంగాణా రాష్ట్రం నుండే కాకుండా ఛత్తీస్‌ఘడ్, మద్యప్రదేశ్, మహారాష్ట్ర, ఓరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి భారీగా భక్తులు మేడారం తరలివస్తారు.

02/16/2016 - 01:58

గోవిందరావుపేట, ఫిబ్రవరి 15: సమ్మక్క-సారలమ్మ తల్లుల జాతరకు తెలంగాణా ప్రభుత్వం అన్ని ఎర్పాట్లు పూర్తి చేసిందని దేవాదాయ, గృహనిర్మాణశాఖ మాత్యులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన, పర్యాటకశాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. సోమవారం మేడారంలోని జంపన్నవాగు వద్ద భక్తులతో మాట్లాడిన ఇంధ్రకరణ్‌రెడ్డి జాతర ప్రాంగణాలను పరిశీలించారు.

02/15/2016 - 14:45

హైదరాబాద్:వరంగల్ జిల్లా మేడారంలో రేపటినుంచి మూడు రోజులపాటు జరిగే మేడారం జాతరకోసం ఆర్టీసి బస్సు సర్వీసులు ప్రారంభించింది. హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఆదిలాబాద్‌తోసహా తెలంగాణలోని పలు ప్రాంతాలనుంచి నిరంతరం ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు.

02/15/2016 - 14:44

ఖమ్మం:రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంథ్రశేఖర్ రావు సోమవారం ఉదయం హైదరాబాద్‌నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకున్నారు. హెలిపాడ్ వద్ద మంత్రి తుమ్మలతోపాటు పలువురు ప్రముఖులు సాదరస్వాగతం పలికారు.

02/15/2016 - 02:32

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ విషయమై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఇదివరకే రెండుసార్లు తేదీలు అనుకున్నా, ఆ తేదీల్లో సమావేశాలు నిర్వహించేందుకు వీలుకుదరలేదు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించుకోవాల్సి ఉంది.

02/15/2016 - 02:31

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ‘క్రిటికల్ అడ్వాంటేజ్ రైడర్’ పేరిట ఆరోగ్య బీమా పథకాన్ని అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టింది. పాలసీదారులతో పాటుగా సహ వ్యక్తికీ ప్రయాణ, వసతి బీమా సదుపాయాన్ని అందిస్తోంది.

02/15/2016 - 02:30

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2016-17లో గిరిజనుల కోసం రూ.13378.5 కోట్లు కేటాయించాలని ఇఫ్లూ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఇస్లావత్ రాజు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన సంఘం తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూడ్ శోభన్ నాయక్ అధ్యక్షతన జరిగిన రచ్చబండ సమావేశంలో ఇస్లావత్ రాజు ప్రసంగించారు.

Pages