-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
భోపాల్, ఏప్రిల్ 16: దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మూడు కోట్ల కేసులు పెండింగ్లో ఉండటం పట్ల కేంద్ర న్యాయ శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గత మూడేళ్లలో ఈ పెండింగ్ కేసులు పెరుగుతున్న వేగం కాస్త తగ్గిందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఇక్కడి నేషనల్ జుడీషియల్ అకాడమీలో జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నాలుగో సదస్సులో సదానంద గౌడ మా ట్లాడుతూ ఈ విషయం చెప్పారు.
బెంగళూరు, ఏప్రిల్ 16: కర్నాటకలో ఖరీదైన బహుమతుల వార్తలు కలకలం రేపుతున్నాయి. లక్షలాది రూపాయల హాబ్లెట్ వాచీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య గిఫ్ట్గా పొందారన్న వార్తలు ఆ మధ్య పెద్ద దుమారానే్న రేపాయి. ఈ వివాదం నుంచి సిఎం అతికష్టం మీద బయటపడ్డారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యెడ్యూరప్ప ల్యాండ్ క్రూయిజర్ కారు వార్తల్లోకి ఎక్కింది.
బెంగళూరు, ఏప్రిల్ 16: కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు భాగస్వామిగా ఉన్న ఓ కంపెనీకి నగరంలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటుకు కాంట్రాక్ట్ ఇవ్వడం చినికి చినికి గాలివానగా మారుతుండడంతో ముఖ్యమంత్రి కుమారుడు శనివారం ఆ కంపెనీనుంచి రాజీనామా చేశారు.
భోపాల్, ఏప్రిల్ 16: భారత రాజ్యాంగం రాజ్యంలోని మూడు వ్యవస్థల మధ్య స్పష్టమైన అధికారాల విభజనను ఏర్పాటు చేసిందని పేర్కొంటూ న్యాయ వ్యవస్థ క్రియాశీలత ఈ అధికారాల విభజనను నీరుగార్చడానికి దారితీయకూడదని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ న్యాయమూర్తులకు సూచించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: పనామా కుంభకోణంలో చిక్కుకున్న నవాజ్ షరీఫ్ను పాకిస్తాన్ సైన్యం ప్రధాన మంత్రి పదవి నుంచి తొలగిస్తోందా? ఆయనతోపాటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ, పాకిస్తాన్ తేహరీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కూడా లండన్ చేరుకోవటం చర్చనీయాంశంగా మారింది.
ముంబయి: ఇక్కడి లీలావతి ఆస్పత్రిలో బాలీవుడ్ అగ్రనటుడు దిలీప్కుమార్ (93) క్రమంగా కోలుకుంటున్నారు. ఈ విషయమై దిలీప్ భార్య, అలనాటి నటి సైరాబాను శనివారం ఒక ప్రకటన చేశారు. జ్వరం, ఛాతీనొప్పి రావడంతో ఆయనను శుక్రవారం అర్ధరాత్రి దాటాక రెండున్నర గంటల సమయంలో ఆస్పత్రిలో చేర్పించామని ఆమె పేర్కొన్నారు. కాగా, మరో 72 గంటల వరకూ దిలీప్ ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగానే ఉంటుందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.
బెంగళూరు: భూకబ్జాలు, పలు అవినీతి వ్యవహారాల్లో జైలుకి వెళ్లి వచ్చిన కర్నాటక బిజెపి అధ్యక్షడు, మాజీ సిఎం యడ్యూరప్పకు కాంగ్రెస్ను విమర్శించే నైతిక హక్కు లేదని యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటకలో కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తానంటూ యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం ఇక్కడ ధర్నా జరిపారు.
దిల్లీ: ట్రాఫిక్, కాలుష్యం సమస్యలపై ప్రజలకు అవగాహన కలగాలన్న ఉద్దేశంతో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా శనివారం తన కార్యాలయానికి సైకిల్ తొక్కుతూ వచ్చారు. దేశ రాజధానిలో ట్రాఫిక్, వాయు, శబ్దకాలుష్యాలు నానాటికీ మితిమీరుతున్నాయన్నారు. కార్లు, ఆటోల యజమానులు ప్రభుత్వానికి సహకరించి దిల్లీలో ‘సరి, బేసి’ సంఖ్య విధానంలో వాహనాలు నడిపేందుకు ముందుకు రావాలన్నారు.
శ్రీనగర్: హంద్వారా ఘటన అనంతరం కాశ్మీర్లో పలు చోట్ల ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంని. భద్రతాదళ సిబ్బంది శుక్రవారం జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించడంతో వేర్పాటువాద ఉద్యమ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్రిక్తత చల్లారక పోవడంతో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగిస్తూ, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
ఆగ్రా: బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ శనివారం సాయంత్రం 4 గంటలకు ఇక్కడి తాజ్మహల్ కట్టడాన్ని వీక్షించేందుకు వస్తున్న సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విలియం దంపతులు బస చేసే హోటల్ వద్ద, తాజ్మహల్ పరిసరాల్లో అణువణువూ గాలించారు. 24 ఏళ్ల క్రితం విలియం తల్లి డయానా తాజ్మహల్ను సందర్శించారు.