జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో పలుచోట్ల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: హంద్వారా ఘటన అనంతరం కాశ్మీర్‌లో పలు చోట్ల ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంని. భద్రతాదళ సిబ్బంది శుక్రవారం జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించడంతో వేర్పాటువాద ఉద్యమ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్రిక్తత చల్లారక పోవడంతో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగిస్తూ, ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు. హంద్వారాలో కొద్దిరోజుల క్రితం ఓ బాలికను జవాన్ వేధించాడంటూ స్థానికులు ఆర్మీ క్యాంపుపై దాడి జరపడం, ఆ తర్వాత భద్రతాదళ సిబ్బంది కాల్పుల్లో నలుగురు మరణించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు మొదలవడంతో భద్రతా సిబ్బంది పలుసార్లు కాల్పులు జరిపారు.