S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/17/2016 - 02:39

బెంగళూరు, ఏప్రిల్ 16: కర్నాటకలో ఖరీదైన బహుమతుల వార్తలు కలకలం రేపుతున్నాయి. లక్షలాది రూపాయల హాబ్లెట్ వాచీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య గిఫ్ట్‌గా పొందారన్న వార్తలు ఆ మధ్య పెద్ద దుమారానే్న రేపాయి. ఈ వివాదం నుంచి సిఎం అతికష్టం మీద బయటపడ్డారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యెడ్యూరప్ప ల్యాండ్ క్రూయిజర్ కారు వార్తల్లోకి ఎక్కింది.

04/17/2016 - 02:37

బెంగళూరు, ఏప్రిల్ 16: కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు భాగస్వామిగా ఉన్న ఓ కంపెనీకి నగరంలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటుకు కాంట్రాక్ట్ ఇవ్వడం చినికి చినికి గాలివానగా మారుతుండడంతో ముఖ్యమంత్రి కుమారుడు శనివారం ఆ కంపెనీనుంచి రాజీనామా చేశారు.

04/17/2016 - 02:36

ముంబయి, ఏప్రిల్ 16: బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ తీవ్ర అస్వస్థతతో శనివారం ఉదయం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. నిపుణుల పర్యవేక్షణలో దిలీప్‌కుమార్‌కు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని.

04/17/2016 - 02:57

శ్రీనగర్, ఏప్రిల్ 16: జమ్మూకాశ్మీర్‌లోని హంద్వారా పట్టణంలో విద్యార్థినిపై ఓ జవాన్ అసభ్య ప్రవర్తన నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు తగ్గించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ ఘటన తరువాత జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. శాంతి భద్రతలు అదుపుచేయడానికి కేంద్రం అదనపుబలగాలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. 3,600 మంది సాయుధ బలగాలు కాశ్మీర్ లోయ ప్రాంతంలో మోహరిస్తారు.

04/17/2016 - 03:00

వాషింగ్టన్, ఏప్రిల్ 16: రాజకీయ వ్యవస్థలో అధికార పక్షంలో, లేదా ప్రతిపక్షంలో ఉన్న వారు బాధ్యతా రహితమైన ప్రకటనలు చేసిన సంఘటనలు ఒకటి, రెండు ఉంటే ఉండవచ్చునని, అంతమాత్రాన దేశంలో అసహన వాతావరణం ఉందంటూ చెప్పడం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అలాంటి సంఘటనలు దారుణమని ఆయన అంటూ, భారత్‌లాంటి పెద్ద దేశంలో అలాంటి సంఘటనలు అరుదని అభిప్రాయ పడ్డారు. ‘ఇవి చాలా చెడ్డ సంఘటనలు.

04/17/2016 - 02:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ‘నేను నా దేశ భక్తిని నిరూపించుకోవలసిన పరిస్థితి రావడం ఒక్కోసారి నాకు చాలా బాధ కలిగిస్తోంది.. ఒక్కోసారయితే ఏడుపే వస్తుంది’ అని బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ వాపోయారు. అంతేకాదు, తన కుటుంబం ఒక మినీ ఇండియా అని, తనకన్నా గొప్ప దేశ భక్తుడు ఎవరూ లేరని కూడా ఆయన స్పష్టం చేశారు.

04/17/2016 - 02:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశం సూర్యుడి అగ్నిశిఖలకు మాడి మసైపోతోంది. ఏ రాష్ట్రం చూసినా అదే పరిస్థితి. ఈశాన్యరాష్ట్రాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ వడగాడ్పులు ప్రజల జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పశ్చిమబెంగాల్, ఒడిషా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, చండీగఢ్, మరాఠ్వాడా, విదర్భ, తెలంగాణ, రాయల సీమల్లో వేడి సెగలు భగ్గుమంటున్నాయి.

04/17/2016 - 02:20

కోల్‌కతా, ఏప్రిల్ 16: పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నకల్లో భాగంగా 56 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేయడం, తృణమూల్ కాణగ్రెస్ పార్టీ నాయకుడు అనుబ్రత మండల్‌పై ఇసి నిఘా కొనసాగుతున్న నేపథ్యంలో రెండో దశ ఎన్నికలు జరుగుతుండడం గమనార్హం.

04/17/2016 - 02:18

చెన్నై, ఏప్రిల్ 16: దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఎండిఎంకె ప్రధాన కార్యదర్శి వైకో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మే 16న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కోవిల్‌పట్టి నియోజకవర్గంనుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చెన్నైలో శనివారం జరిగిన ఎన్నికల సభలో వైకో స్వయంగా ఈ విషయం ప్రకటించారు.

04/17/2016 - 02:17

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: కొన్ని విషయాలకొచ్చేసరికి ఎంత గొప్పవారయినా సామాన్యుల్లాగానే ప్ర వర్తిస్తారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీల కుమార్తె అయిన ప్రియాంక గాంధీ కూడా అద్దె విషయానికి వచ్చే సరికి సామాన్యుల్లాగానే బేరమాడి అద్దె ను తగ్గించుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం 1997లో ప్రియాంక గాంధీకి ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లో ఓ భవనాన్ని కేటాయించింది.

Pages