S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/12/2016 - 05:36

న్యూఢిల్లీ, మే 11:ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. తన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య విరుద్ధంగా బర్త్ఫ్ చేసి రాష్టప్రతి పాలన విధించారంటూ చివరివరకూ న్యాయపోరాటం చేసిన హరీశ్‌రావత్ అంతిమ విజయం సాధించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం జరిగిన బల పరీక్షలో హరీశ్ రావత్ ప్రభుత్వం విజయం సాధించిందని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది.

05/12/2016 - 05:34

న్యూఢిల్లీ, మే 11: రాజ్యాంగ సంక్షోభం నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్టప్రతి పాలనను ఎత్తివేయాలని కేంద్ర కేబినెట్ బుధవారం సిఫార్సు చేసింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో రావత్ సర్కార్ విజయానికి సుప్రీం కోర్టు ఆమోద ముద్ర పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

05/12/2016 - 05:32

న్యూఢిల్లీ, మే 11: కరవు కాటకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉష్టప్రక్షి చందంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉండజాలదని, తన రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.

05/12/2016 - 05:28

న్యూఢిల్లీ, మే 11: ఎన్‌డిఏ ప్రభుత్వం తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల పేరుతో గడువుకు రెండు రోజుల ముందే లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేయించింది. దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులపై చర్చ ముగిసిన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ బుధవారం సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాలకు లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇదిలా ఉంటే రాజ్యసభ కూడా గడువుకు ఒక రోజు ముందు అంటే గురువారం నిరవధికంగా వాయిదా పడనున్నది.

05/12/2016 - 05:26

న్యూఢిల్లీ, మే 11: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలంటూ కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు సభ్యుడి బిల్లుకు ఇప్పుడప్పుడే మోక్షం లభించే అవకాశాలు మృగ్యమైపోయాయి. రెండు రోజులు గడువుండగానే బుధవారం లోక్‌సభ నిరవధిక వాయిదా పడటం.. గురువారం రాజ్యసభ కూడా వాయిదా పడుతుండటంతో ఓటింగ్ జరగకుండానే బిల్లు అటకెక్కింది.

05/11/2016 - 18:51

దిల్లీ: ముస్లిం మతోన్మాద ఉగ్రవాదుల నుంచి భారత్‌ను రక్షించే సత్తా డోనాల్డ్ ట్రంప్‌కు ఉందని హిందూసేన కొనియాడింది. అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలో ట్రంప్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం హిందూసేన యాగం నిర్వహించింది.

05/11/2016 - 17:46

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో బుధవారం పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు మరణించారని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకుని, తప్పించుకున్న మావోల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, తమకు తుపాకులు పేలిన శబ్దాలు వినిపించలేదని, ఎక్కడో చంపేసిన మావోయిస్టులను పోలీసులు ఇక్కడికి తెచ్చి పడేశారని సమీప గ్రామాల వారు అంటున్నారు.

05/11/2016 - 17:46

ముంబయి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసు బుధవారం కీలక మలుపుతిరిగింది. ఈ కేసులో నిందితుడైన ఇంద్రాణి మాజీ కారు డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ తాను అప్రూవర్‌గా మారి, విచారణకు సహకరిస్తానని సిబిఐ ప్రత్యేక కోర్టులో పేర్కొన్నాడు. అప్రూవర్‌గా మారతానని కొద్దిరోజుల క్రితం రాయ్ సిబిఐ జడ్జికి రెండు పేజీల లేఖ రాశాడు. దీంతో రాయ్‌ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మహాజన్ బుధవారం విచారించారు.

05/11/2016 - 17:33

న్యూదిల్లి:ఆర్థిక నేరాల కేసుల్లో చిక్కుకుని, నిధుల చెల్లింపు జరపకపోవడంతో 2014నుంచి జైలులో గడుపుతున్న సహారా సంస్థ అధిపతి సుబ్రతారాయ్‌కు మంజూరు చేసిన పెరోల్‌ను జూలై 11వరకు పొడిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. తన తల్లి మరణించడంతో అంతిమ సంస్కారాలకోసం నాలుగువారాలపాటు పెరోల్ పొందిన సుబ్రతా ఆర్థిక నేరాల కేసులకు సంబంధించి రూ.

05/11/2016 - 17:01

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా సాధించేందుకు రాజ్యసభలో తమ పార్టీ ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుకు అన్ని పక్షాలూ మద్దతు ఇవ్వాలని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి బుధవారం ఇక్కడ కోరారు. ఈ బిల్లుకు తప్పనిసరిగా మద్దతు ఇచ్చేందుకు తమ పార్టీ విప్ జారీ చేస్తుందన్నారు. దీనికి మద్దతు ఇవ్వని పక్షంలో టిడిపి, బిజెపిల బండారం బయటపడుతుందన్నారు.

Pages