S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/13/2016 - 04:02

న్యూఢిల్లీ, జూన్ 12: రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరుపుకోనున్న నేపథ్యంలో కేంద్ర పారామిలటరీ బలగాలకు యోగా పతకాలను ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. భౌతిక, మానసిక, ఆధ్యాత్మికతల క్రమశిక్షణ అయిన యోగాలో నైపుణ్యం ప్రదర్శించిన వారికి పతకాలు ఇస్తారు. పారామిలటరీ బలగాల కోసం పదవీ విరమణ చేసిన సైనికులను మాస్టర్ యోగ శిక్షకులుగా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.

06/13/2016 - 03:54

న్యూఢిల్లీ, జూన్ 12: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కమల్‌నాథ్ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు. వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం వీరిద్దరిని పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.

06/13/2016 - 03:53

న్యూఢిల్లీ, జూన్ 12: భారత్‌లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి మే, మార్చి నెలలు అత్యంత క్రూరమైన నెలలుగా నిలిచాయి. గత రెండేళ్లలో ప్రతి సంవత్సరం మే, మార్చి నెలల్లోనే సుమారు 18 శాతం రోడ్డు ప్రమాదాలు జరగడం విశేషం. నిరుడు ఒక్క మే నెలలోనే దేశంలో 46,247 రోడ్డు ప్రమాదాలు జరిగి, 14వేలకు పైగా మంది దుర్మరణం పాలయ్యారు. 47వేల మంది గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాలపై నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం..

06/13/2016 - 02:11

న్యూఢిల్లీ, జూన్ 12: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఓ 23 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేసి నడుస్తున్న కారులోనే సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డ మరో దురాగతం వెలుగులోకి వచ్చింది. దేశంలో మహిళలకు భద్రత కల్పించేందుకు నిర్భయ చట్టాన్ని పటిష్టంగా అమలుచేస్తున్నప్పటికీ ఈ ఘటన వెలుగుచూడటం, అదీ దేశ రాజధాని నగరంలోనే జరగడం దిగ్భ్రాంతిని రేకెత్తిస్తోంది.

06/12/2016 - 17:15

న్యూదిల్లి:త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా సీనియర్ నాయకుడు, వ్యూహచతురుడు గులాంనబీ అజాద్‌కు బాధ్యతలు అప్పగించారు. అలాగే పంజాబ్, హర్యానాల ఇన్‌ఛార్జ్‌గా మరో సీనియర్ నేత కమల్‌నాథ్‌కు బాధ్యతలు అప్పగించారు. పనిలోపనిగా ఎఐసిసి జనరల్ సెక్రటరీలుగా వారిని ప్రకటించారు.

06/12/2016 - 17:11

అలహాబాద్:ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వ్యూహాన్ని రచించేందుకు జాతీయ కార్యవర్గ సమావేశాలను వేదికగా చేసుకునేందుకు బిజెపి సమాయత్తమైంది. రెండురోజులపాటు జరిగే ఈ సమావేశాలు ఆదివారం సాయంత్రం ప్రారంభం కానుండగా ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా పలువురు పార్టీ ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు.

06/12/2016 - 16:48

న్యూదిల్లి:రాష్టప్రతి ప్రణభ్ ముఖర్జీ ఆఫ్రికాలో మూడు దేశాల్లో పర్యటించనున్నారు. రాష్టప్రతి భవన్‌లో ఆయనను కలసిన ప్రధాని మోదీ, ఉపరాష్టప్రతి హమిద్ అన్సారి, దిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్, ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ తదితరులు వీడ్కోలు చెప్పారు. ఘనా, ఐవరీకోస్ట్, నమీబియా దేశాల్లో ప్రణభ్ పర్యటించనున్నారు. విద్య, సామాజిక, ఆర్థిక అంశాలపై ఆయా దేశాలతో చర్చిస్తారు.

06/12/2016 - 05:58

న్యూఢిల్లీ, జూన్ 11: ప్రఖ్యాత పాత్రికేయుడు ఇందర్ మల్హోత్రా(86) శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఢిల్లీలోని ఆసుపత్రిలో కృత్రిమ శ్వాసపై ఉన్న మల్హోత్రా శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. దేశంలో ఎన్నదగిన పాత్రికేయులలో ఒకరైన మల్హోత్రా ది స్టేట్స్‌మన్, టైమ్స్‌ఫ్ ఇండియా, న్యూఢిల్లీ వంటి పత్రికల్లో పనిచేశారు.

06/12/2016 - 05:28

న్యూఢిల్లీ, జూన్ 11: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్మించనున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ (ట్విన్ టవర్స్) ఎత్తును పరిమితిని మించి అనుమతించటం సాధ్యంకాదని పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు.

06/12/2016 - 05:16

న్యూఢిల్లీ, జూన్ 11: అఖిల భారత కాంగ్రెస్ కమిటీని పునర్వ్యవస్థీకరణకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సమాయత్తం అవుతున్నారు. రాజ్యసభకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సోనియా కాంగ్రెస్ కమిటీని పునర్వ్యవస్థీకరిస్తారన్న అంచనాలున్న విషయం తెలిసిందే. అందుకువీలుగా ఆమె కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల రాజీనామాలు తీసుకున్నట్టు ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి.

Pages