S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/15/2016 - 12:21

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లోని కుప్వారా వద్ద బుధవారం ఉదయం భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని సైనికులు కాల్చి చంపారు. నలుగురు జవాన్లు గాయపడ్డారు. పరారైన ఉగ్రవాదుల ఆచూకీ కోసం సైనికులు తీవ్రంగా గాలిస్తున్నారు.

06/15/2016 - 12:02

దిల్లీ: ఉడ్తా పంజాబ్‌ సినిమా వివాదంపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ పంజాబ్‌కు చెందిన ఓ ఎన్జీవో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రెండు రోజుల్లో సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ఎన్జీవో పిటిషన్‌ వేయడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. తొలుత 89 సీన్లను నిషేధించాలని సూచించిన సెన్సార్‌ బోర్డు.. చివరకు 13 కట్లతో సినిమాకు ఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది.

06/15/2016 - 08:16

న్యూఢిల్లీ, జూన్ 14: రాబోయే రోజుల్లో అన్ని సైనిక విభాగాల్లో మహిళల భాగస్వామ్యం పెంచుతామని రక్షణమంత్రి మనోహర్ పారికర్ మంగళవారం తెలిపారు. ‘‘ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నెమ్మదిగా మహిళా సైనికుల భాగస్వామ్యాన్ని పెంచుతాము’ అని ఆయన తెలిపారు. ఎన్‌సిసి విభాగానికి చెందిన మహిళలు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన నేపథ్యంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పారికర్ మాట్లాడారు.

06/15/2016 - 08:12

న్యూఢిల్లీ, జూన్ 14: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అత్యంత చురుకైన నాయకుడని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని ఆ పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ అన్నారు. భారతీయ విలువల పట్ల రాహుల్ నిబద్ధత ప్రధాని నరేంద్ర మోదీకన్నా ఎంతో మెరుగని, వాస్తవాలను వక్రీకరించడంలో మోదీకి గొప్ప నేర్పు ఉందని మంగళవారం ఓ న్యూస్ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

06/15/2016 - 08:11

న్యూఢిల్లీ, జూన్ 14: రాజ్యసభలో మూడు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన కొన్ని బిల్లులుసహా ఇప్పటికీ 45 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మే నెలలో లోక్‌సభ సమావేశాలు ముగిసేనాటికి ఐదు బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లులో రాజ్యాంగం 120 రెండో సవరణ బిల్లు ఉంది. అదే జిఎస్‌టి బిల్లు. లోక్‌సభ ఆమోదం తెలిపిన తరువాత గత ఏడాది ఆగస్టులో ఎగువసభ ముందుకు బిల్లు వచ్చింది.

06/15/2016 - 08:10

కోయంబత్తూరు, జూన్ 14: జాతీయ మహిళా విధానం జూలై నెల మూడో వారానికల్లా సిద్ధమవుతుందని, ఒంటరి మహిళల కుటుంబాలకు సంబంధించిన సమస్యలపై దీనిలో ఒక ప్రత్యేక చాప్టర్ ఉంటుందని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ లలితా కుమార మంగళం ఇక్కడ చెప్పారు. ఈ నెల చివరికి సిద్ధం కానున్న ముసాయిదా విధానాన్ని ప్రభుత్వం ముందుంచుతామని, వచ్చే నెల రెండోవారంకల్లా విధానం సిద్ధమయ్యే అవకాశముందని అన్నారు.

06/15/2016 - 08:06

అక్రా, జూన్ 14: ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) లాంటి అంతర్జాతీయ సంస్థల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. బూజుపట్టిన విధానాలు, ఆలోచనలు ఆధునిక కాలపు సమస్యలను పరిష్కరించలేవని ఆయన అన్నారు.

06/15/2016 - 05:02

న్యూఢిల్లీ, జూన్ 14: తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరటంపట్ల హైకమాండ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో సమావేశమై కాంగ్రెస్ నేతల పార్టీ ఫిరాయింపుపై సమీక్ష జరిపారు.

06/14/2016 - 18:13

దిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇటీవల సిఎంగా బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారి దిల్లీకి వచ్చారు. కేంద్ర నిధులు, ఆర్థిక ప్యాకేజీలు, పార్లమెంటులో అన్నాడిఎంకె సభ్యుల సహకారం వంటి విషయాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.

06/14/2016 - 18:12

దిల్లీ: ప్రపంచంలో ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అంతం చేసే దమ్ము అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మాత్రమే ఉందని హిందూసేన మరోసారి కీర్తించింది. ట్రంప్ జన్మదినం సందర్భంగా ఇక్కడి జంతర్‌మంతర్ వద్ద హిందూసేన వేడుకలను నిర్వహించింది. ఏడు కిలోల కేక్‌ను కట్‌చేసి ట్రంప్ బ్యానర్ వద్ద హిందూసేన కార్యకర్తలు ఉత్సవం జరిపారు.

Pages