జాతీయ వార్తలు
అలహాబాద్ చేరుకున్న మోదీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 12 June 2016
అలహాబాద్:ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వ్యూహాన్ని రచించేందుకు జాతీయ కార్యవర్గ సమావేశాలను వేదికగా చేసుకునేందుకు బిజెపి సమాయత్తమైంది. రెండురోజులపాటు జరిగే ఈ సమావేశాలు ఆదివారం సాయంత్రం ప్రారంభం కానుండగా ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా సహా పలువురు పార్టీ ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. భారత రాజకీయాలలో కీలక పాత్ర పోషించే ఉత్తర్ప్రదేశ్ సహా గోవా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పలు అంశాలపై పార్టీలో విస్తృత చర్చ జరగనుంది. మోదీ ప్రభుత్వ విజయాలు, ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికవంటి అంశాలపై చర్చ జరగనుంది.