S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/20/2016 - 17:05

హైదరాబాద్: తాను నటించే నూరవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ముహూర్తపు సన్నివేశానికి రావాలంటూ సినీనటుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం తెలంగాణ సిఎం కెసిఆర్‌ను ఆహ్వానించారు. ఈనెల 22న నగరంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ మొదలవుతోంది. బాలకృష్ణతో పాటు ఆ సినిమా దర్శకుడు క్రిష్ కూడా కెసిఆర్‌ను కలిశారు.

04/20/2016 - 17:04

హైదరాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దిల్లీ వెళతానంటున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ కేసుల మాఫీ కోసం కొంతమంది పెద్దలను కలుస్తుంటారని టిడిపి నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. ఆయన బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, జగన్ వ్యవహార శైలి నచ్చకే వైకాపా ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారన్నారు.

04/20/2016 - 17:03

హైదరాబాద్: ఉపాధి హామీ పథకం కింద పనుల్లో పాల్గొంటున్న కూలీలకు ఇక రోజుకు 194 రూపాయల వేతనం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇంతవరకూ వీరికి రోజుకు 180 రూపాయలు చెల్లించేవారు. పెంచిన వేతనాలకు సంబంధించిన ఉత్తర్వులు ఈ నెల 1 నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

04/20/2016 - 17:02

నల్గొండ: వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఓ బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. తుంగతుర్తి మండలం కుంటపల్లి వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది.

04/20/2016 - 15:09

హైదరాబాద్: ఇంకుడుగుంత లేకుంటే కొత్తగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వరాదని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. జిహెచ్‌ఎంసి వందరోజుల ప్రణాళికపై బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, జలవనరులను పెంచేందుకు ఇంకుడుగుంతల నిర్మాణం తప్పనిసరి అన్నారు. నగరంలో అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించాలని, పారిశుద్ధ్యం మెరుగుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

04/20/2016 - 15:07

హైదరాబాద్: సికిందరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆల్ఫా హోటల్ వద్ద మూడు షాపులు దగ్ధం కావడం వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు. సిసి టీవీ ఫుటేజి ఆధారంగా ఇద్దరు యువకులు షాపులకు నిప్పు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో కేవలం సరదా కోసం వీరు షాపులను దగ్ధం చేశారని విచారణలో తేలింది.

04/20/2016 - 12:34

హైదరాబాద్: అక్రమాలు జరుగుతున్నాయన్న నెపంతో తెలంగాణలోని ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసులు తనిఖీలు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ నాయకులు విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరికి తెలిపారు. బుధవారం ఉదయం వారు కడియంను కలిసి తమ సమస్యలను విన్నవించారు. తనిఖీలు చేసేందుకు విద్యాశాఖ అధికారులను మాత్రమే అనుమతించాలని వారు విజ్ఞప్తి చేశారు.

04/20/2016 - 12:34

హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో బుధ, గురువారాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ రెండు రోజుల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదయ్యే అవకాశం ఉంది. మంగళవారం ఒక్కరోజే తెలంగాణలో వడగాలులకు 30 మంది మరణించగా, నిజమాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

04/20/2016 - 07:20

హైదరాబాద్, ఏప్రిల్ 19: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్ర ధనుష్ అమలులో రాష్ట్రంలో ఇప్పటికే 85 లక్ష్యాన్ని సాధించామని వంద శాతం లక్ష్యాన్ని చేరుకుని దేశంలో ఆదర్శంగా నిలుస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. పిల్లలు వ్యాధుల బారిన పడకుండా వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

04/20/2016 - 07:20

హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణలో ప్రైవేటు కాలేజీల ఆందోళన రోజురోజుకూ ముదురుతోంది. ప్రభుత్వం పోలీసు, విజిలెన్స్ తనిఖీలు ఆపకుంటే కాలేజీల మూత కొనసాగిస్తామని చెబుతున్న యాజమాన్యాలు మంగళవారం నుండి వివిధ రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి వారితో తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించాయి. యాజమాన్యాల సమస్యలపై మాట్లాడిన కాంగ్రెస్, బిజెపి, వామపక్ష నాయకులు ప్రైవేటు విద్యాసంస్థలపై దాడులు తగవన్నారు.

Pages