-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం, జూన్ 15: కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రానికి కావల్సిన ఐదు వేల ఎకరాల భూసేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ సభ ఆగస్టు 2న నిర్వహించేలా సంబంధిత అధికారులు ప్రణాళిక రూపకల్పన చేసారు. ఇందుకు రెండు విడతలుగా 218 బృందాలతో సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించేందుకు ఈ నెల 20 నుంచి అధికారులు ‘అణు’వణువూ సాంకేతికపరంగానే టాబ్స్ద్వారా సర్వే నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.
ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల రైలు ప్రయాణికులు డబుల్ డెక్కర్ రైలు ప్రయాణాన్ని త్వరలోనే ఆస్వాదించబోతున్నారు. విజయవాడ-విశాఖ మధ్య డబుల్ డెక్కర్ను నడపాలని రైల్వే ఉన్నతాధికారులు ఈ మధ్యనే నిర్ణయించారు. అందులో భాగంగానే బుధవారం విశాఖ చేరిన డబుల్ డెక్కర్ ట్రైన్ నిర్వహణలో లోపాలను సరిద్దడానికి ట్రయల్ రన్ నిర్వహించారు.
రిమోట్ పాలనా వ్యవస్థకు ఇక స్వస్తి
సచివాలయంలో ఈ ఆఫీసుతో సమస్యల పరిష్కారం
తుళ్లూరు నుంచి మంచినీటి పైపులైన్లు
సకల సదుపాయాలు కల్పిస్తాం.. నెగిటివ్గా ఆలోచించవద్దు
రెండున్నరేళ్లలో శాశ్వత రాజధాని
భవిష్యత్తులో ఒకే గొడుగు కింద హెచ్ఒడిలు
ఐదురోజులు ఇక్కడ పనిచేసి సెలవులకు వెళితే అభ్యంతరం లేదు
ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ, జూన్ 15: తుని ఘటనలో అరెస్టయిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలే ప్రసక్తి లేదని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి గంటా, హోం మంత్రి చినరాజప్ప మాట్లాడారు. తుని ఘటనలో అరెస్టయిన వారిని విడుదల చేయటానికి ప్రభుత్వం అంగీకరించిందని ముద్రగడ కుమారుడు చెప్పటంలో వాస్తవంలేదని అన్నారు.
రాజమహేంద్రవరం, జూన్ 15:ప్రభుత్వ సానుకూల దృక్పథంతో జరిపిన చర్చలు ఫలప్రదమై ఎట్టకేలకు కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు అంగీకరించారు. సాంకేతిక సమస్యల అనంతరం జైలు నుంచి బెయిలుపై ముద్రగడ అనుచరులను బయటకు తీసుకువచ్చిన తరువాత దీక్ష విరమణకు అంగీకారం కుదిరింది.
రాజమండ్రి: రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైద్య చికిత్స తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారని, తనకు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ఆయన అంగీకరించారని బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బుధవారం సాయంత్రం తెలిపారు. ప్రభుత్వానికి, కాపు నేతలకు మధ్య జరిగిన చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలను ముద్రగడ ముందు ఉంచామన్నారు.
గుంటూరు: ఎపిలో గురువారం నుంచి ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సిఎం చంద్రబాబు తెలిపారు. ఆయన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనులను పరిశీలించిన అనంతరం ‘బడి పిలుస్తోంది’ పోస్టర్ను ఆవిష్కరించారు. బడి ఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలను మెరుగు పరచి, నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు.
విజయవాడ: రాజమండ్రి ఆస్పత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంకు కోర్టు ఆదేశాల మేరకు వైద్య చికిత్స అందిస్తామని, చర్చల పేరిట కాలయాపన జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప బుధవారం తెలిపారు. అయితే, తుని విధ్వంసకాండలో అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టే అవకాశం లేదని, చట్ట ప్రకారం కేసులు నడుస్తాయన్నారు.
అనంతపురం: వైకాపా నుంచి ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదని ఇటీవల టిడిపిలో చేరిన ఎమ్మెల్యే చాంద్పాషా అన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు స్వేచ్ఛగానే టిడిపిలోకి వెళుతున్నారే తప్ప అమ్ముడు పోవాల్సిన అగత్యం వారికి పట్టలేదన్నారు. చంద్రబాబు వల్లే రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి సాధ్యమన్నారు. ఈసారి క్యాబినెట్ విస్తరణ జరిగితే మైనార్టీల నుంచి ప్రాతినిధ్యం ఉంటుందన్నారు.
విజయవాడ: రాష్ట్ర రాజకీయాల్లో అసలైన విలన్ వైఎస్ జగన్ అని, ఆయన ఏనాడూ హీరో కాలేడని టిడిపి నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం ఇక్కడ మీడియాతో అన్నారు. సిఎం పదవి, అవినీతి సంపాదన తప్ప మిగతా విషయాలేవీ జగన్కు పట్టవన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైకాపాకు ప్రజల నుంచి తిరస్కారం తప్పదన్నారు. కులాల పేరిట చిచ్చు రేపేందుకే ముద్రగడ దీక్షపై జగన్ మొసలికన్నీరు కార్చుతున్నారని విమర్శించారు.