ఆంధ్రప్రదేశ్
ముద్రగడకు చికిత్స అందిస్తాం: హోం మంత్రి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 15 June 2016
విజయవాడ: రాజమండ్రి ఆస్పత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంకు కోర్టు ఆదేశాల మేరకు వైద్య చికిత్స అందిస్తామని, చర్చల పేరిట కాలయాపన జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప బుధవారం తెలిపారు. అయితే, తుని విధ్వంసకాండలో అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టే అవకాశం లేదని, చట్ట ప్రకారం కేసులు నడుస్తాయన్నారు. ఈ విషయమై ఎలాంటి షరతులకు అంగీకరించే పరిస్థితి లేదన్నారు. ముద్రగడకు వెంటనే వైద్యచికిత్స అందించాలన్నదే ప్రభుత్వ నిర్ణయమన్నారు.