-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరంలో 603 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి దేశంలోనే తమ సంస్థ సరికొత్త రికార్డును సాధించినట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ సిఎండి శ్రీ్ధర్ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 15 శాతం వృద్ధిరేటు సాధించిన ఏకైక సంస్థగాను, బొగ్గు రవాణాలోనూ అగ్రగామి సంస్థగాను సింగరేణి నిలిచిందని ఆయన చెప్పారు.
నిజామాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం నిజామాబాద్ జిల్లా నర్సింగ్పల్లిలోని వేంకటేశ్వర ఆలయాన్ని సతీసమేతంగా సందర్శించి పూజలు చేశారు. కల్యాణోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయన సమర్పించారు. కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన బ్యూటీపార్లర్ యజమాని వరలక్ష్మి వికారాబాద్ మండలం అనంతగిరిపల్లెలో హత్యకు గురైనట్లు శుక్రవారం పోలీసులు కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి, ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతురాలు వరలక్ష్మిపై పలు ప్రాంతాల్లో గతంలో పలు కేసులు నమోదైనట్లు తెలిసింది.
హైదరాబాద్: ఓ ప్రైవేటు స్కూల్కు చెందిన వాహనం శుక్రవారం నల్లకుంట సమీపంలోని విద్యానగర్లో బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పిన ఈ వ్యాన్ ఒక్కసారి పాదచారులపై దూసుకుపోయింది. వ్యాన్ ఢీకొనడంతో సాయి ప్రకాష్ అనే చిరుద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వ్యాన్ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పటికీ వైస్ చాన్సలర్ అప్పారావును ఇంతవరకూ అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ హెచ్సియులో విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. పరిపాలనా భవనం వద్ద వీరు నిరసనకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్: నగరంలోని చారిత్రక కట్టడమైన చార్మినార్ వద్ద ఫుట్పాత్ల నిర్మాణాన్ని ఆరునెలల్లోగా పూర్తి చేస్తామని పురపాలక మంత్రి కెటిఆర్ చెప్పారు. ఆయన శుక్రవారం మేయర్ రామ్మోహన్, గ్రేటర్ కమిషనర్ జనార్దన రెడ్డితో కలిసి చార్మినార్ ప్రాంతంలో పర్యటించారు. ఇక్కడ ట్రాఫిక్ను నియంత్రించేలా ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్డులు నిర్మిస్తామని, నగర చరిత్రను తెలిపేలా ఆర్టు గ్యాలరీని ఏర్పాటు చేస్తామన్నారు.
నిజామాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ జిల్లాలో నేడు,రేపు జరిపే పర్యటనకు అధికారులు అన్ని సన్నాహాలు పూర్తి చేస్తారు. నర్సింపల్లి వేంకటేశ్వర ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న తర్వాత ఈరోజు సాయంత్రం ఇక్కడ జిల్లా అధికారులతో కరవు పరిస్థితులపై ఆయన సమీక్షిస్తారు. రాత్రికి బాన్స్వాడ చేరుకుని అక్కడే బసచేస్తారు.
నల్గొండ: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృష్ణాబోర్డు ఆదేశాల మేరకు అధికారులు నాగార్జున సాగర్ ఎడమకాలువకు శుక్రవారం ఉదయం మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రజల తాగునీటి అవసరాలకు 4.5 టిఎంసిల నీటిని వినియోగించుకునే వీలుంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో నీటిమట్టం 508 అడుగుల మేరకు ఉంది.
హైదరాబాద్: ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో మామిడి తదితర పంటలకు నష్టం జరిగింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసింది. పిడుగుపాటుకు గురువారం అయిదుగురు మరణించారు. ఉత్తర కోస్తా, తెలంగాణ, రాయలసీమలో శుక్రవారం వర్షం కురిసే అవకాశం ఉంది.
నల్గొండ: నల్గొండ పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అయిదుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఓ రైస్మిల్లులో వీరు దోచుకున్న 1.35 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.