S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/28/2015 - 06:23

న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశంలో అసహనం, మత విద్వేషాలు పెరిగి పోయిన ప్రస్తుత వాతావరణంలో ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టడానికి బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, రాజ్యాంగంలో ‘లౌకికవాదం’ పదం ఉండడమే దానికి ఇబ్బందికరంగా ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించారు.

11/28/2015 - 06:22

జమ్ము, నవంబర్ 27: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) పాకిస్తాన్‌లో భాగమని, ఇకముందు కూడా అది పాకిస్తాన్‌లోనే కొనసాగుతుందని, భారత్‌లో అంతర్భాగంగా ఉన్న జమ్మూకాశ్మీర్ ఈ దేశంలోనే కొనసాగుతుందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి అప్పట్లోనే పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఈ ప్రతిపాదన చేశారని ఆయన పేర్కొన్నారు.

11/28/2015 - 06:21

న్యూఢిల్లీ, నవంబర్ 27: పాకిస్తాన్‌వైపునుంచి భారత భూభాగంలోకి చొరబడడానికి ఉగ్రవాదులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని, ఈ ఏడాది అలాంటి ప్రయత్నాలు గణనీయంగా పెరిగాయని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) డికె పాఠక్ అన్నారు. బిఎస్‌ఎఫ్ 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు.

11/28/2015 - 06:20

న్యూఢిల్లీ, నవంబర్ 27: విభజన వల్ల పోలీసు శిక్షణ కేంద్రాల పరంగా ఆంధ్రప్రదేశ్‌కు కలిగిన నస్టాన్ని భర్తీ చేయటానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్టు సాంకేతిక సహాయ మంత్రి వైఎస్ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రాముడుతో కలిసి ఆయన శుక్రవారం హోమ్ మంత్రితో సమావేశమయ్యారు.

11/28/2015 - 06:19

న్యూఢిల్లీ, నవంబర్ 27: మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీచేసింది. ఆయనతో పాటు ఆయన సహచరులకు కూడా సమన్లు పంపింది. విచారణ నిమిత్తం డిసెంబర్ మొదటి వారంలో తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీచేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే ఆయన సహచరులకు కూడా ఇదే రకమైన ఆదేశాలు అందాయని పేర్కొన్నాయి.

11/28/2015 - 06:19

న్యూఢిల్లీ, నవంబర్ 27: కార్మికుల సంక్షేమం కోసం అనేక వినూత్న పథకాలను ప్రారంభించి కార్మిక శాఖ మంత్రిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అడుగుజాడలలోనే తమ శాఖ పని చేస్తోందని కేంద్ర కార్మిక మంత్రి బం డారు దత్తాత్రేయ స్పష్టం చేశారు.

11/28/2015 - 06:18

బాలాసోర్ (ఒడిశా), నవంబర్ 27: దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన అగ్ని-1 క్షిపణిని భారత్ శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. అణుపదార్థాలను మోసుకెళ్లగలిగే శక్తిగల ఈ క్షిపణికి 700 కిలో మీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించగలిగే సామర్థ్యం ఉంది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్‌ఎఫ్‌సి) శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఒడిశా తీరంలోని టెస్ట్ రేంజ్ నుంచి అగ్ని-1 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు.

11/28/2015 - 06:16

ముంబయి, నవంబర్ 27: రిలయన్స్ ముంబై మెట్రోలో పనిచేస్తున్న షీనా బోరా రాజీనామా పత్రంపై తనతో బలవంతంగా ఫోర్జరీ చేయించారని ఇంద్రాణి వ్యక్తిగత కార్యదర్శి కాజల్ శర్మ సిబిఐ విచారణలో వెల్లడించింది. షీనా సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు తొలుత తాను అంగీకరించలేదని, కానీ ఒత్తిడి చేయడం వల్ల చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఇంద్రాణికి చెందిన ఐఎన్‌ఎక్స్ కంపెనీలో 2002 నుంచి 2007 వరకు కాజల్ శర్మ ఉద్యోగిగా పనిచేశారు.

11/28/2015 - 05:19

న్యూఢిల్లీ, నవంబర్ 27: న్యాయవాదులు సమ్మెకు దిగడం లేదా కోర్టుల బహిష్కరణకు పిలుపునివ్వడం చేయరాదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అంతేకాదు ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి బార్ అసోసియేషన్లకు ఒక నెల రోజుల గడువు ఇచ్చింది. ‘మా దృష్టిలో లాయర్లు సమ్మెకు దిగరాదు’ అని న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, అరుణ్ మిశ్రాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.

11/28/2015 - 05:15

న్యూఢిల్లీ, నవంబర్ 27: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను నియమించే పద్ధతి ఏ చట్టం ప్రకారం కూడా సమర్థనీయం కాదని భారత ప్రభుత్వం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను నియమించటానికి ప్రాతిపదికగా ఉన్న కొలీజియం వ్యవస్థ చట్టబద్ధతను ప్రభుత్వం ప్రశ్నించింది.

Pages