-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
బెంగళూరు, జూలై 18:దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన డిఎస్పి ఆత్మహత్య కేసులో కర్నాటక మంత్రి కెజె జార్జి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. డిఎస్పి ఎమ్కె గణపతి ఆత్మహత్యకు కారకులయ్యారంటూ తనపైనా, మరో ఇద్దరు అధికారులపైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని స్థానిక కోర్టు ఆదేశించడంతో మంత్రి జార్జి ఈ నిర్ణయం తీసుకున్నారు.
న్యూఢిల్లీ, జూలై 18: కృష్ణా నదీ జలాల కేటాయింపులపై బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా ఆదేశించాలని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని సిఎం కెసిఆర్ కోరారు. ఢిల్లీ పర్యటనలోవున్న కెసిఆర్, సోమవారం పలువురు ఎంపీలతో వెళ్లి ఉమాభారతిని కలిశారు.
న్యూఢిల్లీ, జూలై 18: కొందరు న్యాయాధికారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థను రోడ్డుకీడ్చి పరిస్థితులను విషపూరితం చేశారని దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణకు చెందిన కొందరు న్యాయాధికారులు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలకు దిగడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ, జూలై 18: కాశ్మీర్ అల్లర్లకు ఆజ్యం పోస్తున్నది పాకిస్తానేనని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొరుగున ఉన్న పాకిస్తాన్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, ముస్లింలను రక్షించేది తామేనని చెప్పుకునే అర్హత దానికెంత మాత్రం లేదని సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా అన్నారు.
పాట్నా, జూలై 18: బీహార్లోని గయలో సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత జరిగిన నక్సల్ దాడిలో ఎనిమిది మంది సిఆర్పిఎఫ్ కమాండోలు మరణించారు. కోబ్రా కమాండోలతో కలిసి సిఆర్పిఎఫ్ దళాలు తిరిగి వస్తున్న సమయంలో ఐఈడీ పేలుళ్లకు నక్సల్స్ పాల్పడటంతో ఈ సంఘటన జరిగింది. మరణించిన ఎనిమిది మంది సిఆర్పిఎఫ్ కోబ్రా కమాండోలేనని స్పష్టం అవుతోంది.
న్యూఢిల్లీ, జూలై 18: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు భుజం భుజం కలిపి విస్తృతమైన చర్చల ద్వారా ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమావేశాల్లో తీసుకోవటం ద్వారా దేశానికి ఒక కొత్త దిశానిర్దేశం చేయాలని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ, జూలై 18: పంజాబ్కు చెందిన సీనియర్ నాయకుడు, నవజ్యోత్సింగ్ సిద్దు సోమవారం రాజ్యసభ సభ్యత్వంతోపాటు బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీ క్రికెటర్ సిద్దు నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు షాక్ ఇచ్చేదే.
న్యూఢిల్లీ, జూలై 18: రాష్ట్రాల బోర్డులను ఈ సంవత్సరం ఏకీకృత మెడికల్ అండ్ డెంటల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నీట్ పరిధిలోకి రాకుండా ఉంచేందుకు జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నది.
ముంబై, జూలై 18: అహ్మద్ నగర్ జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం వ్యవహారం మహారాష్ట్ర ఉభయసభలను స్తంభింపజేసింది. సోమవారం నుంచి ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో తొలిరోజే కాంగ్రెస్, ఎన్సిపిలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నాయి. పదిహేనేళ్ల అమ్మాయిపై గతవారం ముగ్గురు వ్యక్తులు దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టి అతికిరాతకంగా హత్యచేసిన సంగతి తెలిసిందే.
శ్రీనగర్, జూలై 18: అల్లర్లతో అట్టుడుకుతున్న కాశ్మీర్లో సోమవారం కూడా పది జిల్లాల్లో కర్ఫ్యూ అమలులో వుంది. ఆదివారం రాత్రి పిడిపి ఎమ్మెల్యే మహమ్మద్ ఖలీల్ బంద్పై ఒక గుంపు రాళ్లతో దాడికి దిగింది. దీంతో ఆ ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ కొన్నిచోట్ల రాళ్లు రువ్విన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.