-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
బెంగళూరు: కర్ణాటకలోని గుల్బర్గాలో మంగళవారం మధ్యాహ్నం కారును లారీ ఢీకొనడంతో ఎనిమిది మంది మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ముంబయి: నేడు స్వల్ప లాభాలతో దేశీయ మార్కెట్లు ముగిశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 67.16 వద్ద కొనసాగుతోంది.సెన్సెక్స్ 41 పాయింట్లు లాభపడి 27,787 వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 8,528 వద్ద ముగిసింది.
దిల్లీ: నిన్న రూ.200 తగ్గి రెండు వారాలు కనిష్ఠానికి చేరుకున్న బంగారం ధర ఈరోజు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో పసిడి ధర పైకి వెళ్లింది. దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.30,750కి చేరింది. కేజీ వెండి ధర రూ.70 పెరిగి రూ.46,330కి చేరుకుంది.
దిల్లీ: ఆర్ఎస్ఎస్కు తమ పార్టీ యువనేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణమంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో తాము న్యాయపరంగా ముందుకు పోతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆరెస్సెస్కు క్షమాపణ చెబుతారా? లేక విచారణను ఎదుర్కొంటారా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించడంపై కాంగ్రెస్ నేతలు స్పందించారు.
దిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణమని గతంలో ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడికి సుప్రీం కోర్టు మంగళవారం గట్టి షాక్ ఇచ్చింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆరెస్సెస్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో కోర్టు ఘాటుగా స్పందించింది. ఆరెస్సెస్కు క్షమాపణలు చెబుతారా? లేక పరువునష్టం కేసులో విచారణ ఎదుర్కొంటారా?- అని సుప్రీం కోర్టు కాంగ్రెస్ యువనేతను ప్రశ్నించింది.
దిల్లీ: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాల్లో జన జీవనం అతలాకుతలమవుతోంది. నదులు, వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో వరద తాకిడి సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్, ఉత్తరాఖండ్, యుపి, బిహార్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం అవస్థల పాలయ్యారు. అస్సాం, పశ్చిమబెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు ఇబ్బందులను తెచ్చిపెట్టాయి.
దిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ను ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీ కెవిపి రామచంద్రరావు మంగళవారం ఇక్కడ కలిశారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుపై కెవిపి ఈ సందర్భంగా దిగ్విజయ్కు వివిరించారు. ఈ బిల్లు ఆమోదానికి వివిధ పార్టీల సహకారం తీసుకునే విషయమై ఆయన దిగ్విజయ్ నుంచి సలహాలు తీసుకున్నారు.
హైదరాబాద్: గురుపూర్ణిమ సందర్భంగా మహారాష్టల్రోని షిర్డీతో పాటు తెలుగురాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాల్లో మంగళవారం నాడు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రావడంతో షిర్డీ సాయి ఆలయం వద్ద తెల్లవారు జాము నుంచే కోలాహలం నెలకొంది. ఇక, హైదరాబాద్లోని పంజగుట్ట, దిల్సుఖ్నగర్, ఫిల్మ్నగర్లోని సాయిబాబా ఆలయాల్లో భక్తులు బారులు తీరారు.
ఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బంగ్లాదేశ్, ఫ్రాన్స్లో ఉగ్రదాడి మృతులకు సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై లోక్సభలో టీడీపీ నోటీస్ ఇచ్చింది. భారత వైద్య మండలి చట్టసవరణ బిల్లు, దంత వైద్యులచట్ట సవరణ బిల్లుపై లోక్సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
మంగళూరు: బంగారంస్మగ్లర్లకు సాయం చేస్తున్న ఇద్దరు స్పైస్జెట్ ఉద్యోగులను మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ అంతర్జాతీయ విమానంలో సీటు కింద దాచి ఉంచిన బంగారాన్ని గుర్తించారు. స్మగ్లర్లకు సాయం చేస్తున్న మంగళూరు ఎయిర్పోర్టులో పనిచేసే మహ్మద్ హనీఫ్, ముద్దయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు స్పైస్జెట్ తెలిపింది.