జాతీయ వార్తలు
గయలో పెట్రేగిన నక్సల్స్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 July 2016
పాట్నా, జూలై 18: బీహార్లోని గయలో సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత జరిగిన నక్సల్ దాడిలో ఎనిమిది మంది సిఆర్పిఎఫ్ కమాండోలు మరణించారు. కోబ్రా కమాండోలతో కలిసి సిఆర్పిఎఫ్ దళాలు తిరిగి వస్తున్న సమయంలో ఐఈడీ పేలుళ్లకు నక్సల్స్ పాల్పడటంతో ఈ సంఘటన జరిగింది. మరణించిన ఎనిమిది మంది సిఆర్పిఎఫ్ కోబ్రా కమాండోలేనని స్పష్టం అవుతోంది. ఈ సంఘటనలో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడటం వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. జవాన్లకు, నక్సల్స్కు కొంతసేపు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ హతమయినట్లు తెలుస్తోంది.