S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాష్ బ్యాక్ @ 50

03/21/2020 - 22:56

కారంచేడు గ్రామానికి చెందిన యార్లగడ్డ వెంకన్నచౌదరి చిత్ర నిర్మాణంపట్ల ఆసక్తితో శంభూ ఫిలింస్ పతాకంపై 1960లో నిర్మించిన చిత్రం -నమ్మినబంటు. తరువాత వీరు ‘పూజాఫలం’, ‘శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు’ చిత్రాలు రూపొందించారు. నమ్మినబంటు చిత్ర ప్రారంభంలో టైటిల్స్‌కి ముందు నటుడు కెవియస్ శర్మ గొంతుతో -ఈ నేలమీద గాలి, నీరు, భూమి ఏ ఒక్కరి సొత్తు కాదు.

03/14/2020 - 22:31

తొలుత అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి అశ్వనీ పిక్చర్స్ పతాకంపై సంగీత దర్శకులు ఆదినారాయణరావు ‘మాయలమారి/ మాయక్కారి’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. తరువాత 1951లో తన భార్య, ప్రముఖ నటి అంజలీదేవి పేరుమీద అంజలీ పిక్చర్స్ నెలకొల్పి పలు చిత్రాలను రూపొందించారు. తరువాత పెద్ద కుమారుడు చిన్నారావు పేరిట చిన్ని బ్రదర్స్ స్థాపించి కొన్ని చిత్రాలు నిర్మించారు.

03/07/2020 - 23:43

విశ్వకవి రవీంద్రుని శాంతినికేతన్‌లో చదువుకున్న సీవీఆర్ ప్రసాద్ సారథీ స్టూడియో స్థాపించిన వారిలో ప్రముఖులు. సారథీ సంస్థలో దర్శకులు తాపీ చాణుక్య, చైర్మన్ రామకృష్ణ ప్రసాద్‌లతో కలిసి పలు చిత్రాలు రూపొందించారు. తరువాత -సొంతంగా సినిమా నిర్మించాలనే ఆశయంతో ‘ప్రగతి పిక్చర్స్’ బ్యానర్ రూపొందించారు. ఆ బ్యానర్‌పై సీవీఆర్ ప్రసాద్ నిర్మించిన తొలి చిత్రం -విధి విలాసం.

02/29/2020 - 22:56

1945లో వచ్చిన ‘మాయాలోకం’ చిత్రంతో నటుడిగా ప్రస్థానం మొదలెట్టారు పద్మనాభం. పలు చిత్రాల్లో మంచి హాస్యనటుడిగా ప్రత్యేకత సాధించారు. రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ ద్వారా సినిమాల్లో నటిస్తూనే నాటకాల్లోనూ పలు పాత్రలు ధరించి ఉభయ రంగాల్లో మన్ననలు అందుకున్నారు. రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ బ్యానర్‌పై తొలిసారిగా యన్టీ రామారావు, సావిత్రి కాంబినేషన్‌లో -దేవత చిత్రం రూపొందించి నిర్మాతయ్యారు.

02/22/2020 - 23:10

కడప జిల్లా కొత్తపేటలో 1908 నవంబర్ 16న జన్మించారు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బిఎన్ రెడ్డి). నటన, నాటక రంగంపట్ల మక్కువతో మద్రాసు వెళ్లారు. బళ్లారి రాఘవతో ఒక నాటకంలో నటించారు. 1936లో కొందరి స్నేహితులతో కలిసి బిఎన్‌కె ప్రెస్ స్థాపించారు. తరువాత రోహిణి సంస్థ అధినేత హెచ్‌ఎం రెడ్డి వద్ద ‘గృహలక్ష్మి’ చిత్రంతో నిర్మాణ వ్యవహారాల్లో అనుభవం సంపాదించారు.

02/15/2020 - 23:16

దేశభక్తిని ప్రబోధించే చిత్రాన్ని రూపొందించాలని అన్నపూర్ణా సంస్థ నిర్మాత భావించారు. తమ అభిప్రాయాన్ని రచయిత డివి నరసరాజుతో ప్రస్థావించారు. దానికి ఆమోదం తెలిపిన నరసరాజు, చైనా వార్‌తో ప్రారంభించి పాకిస్తాన్ వార్‌తో ముగిస్తూ చక్కని ఫ్యామిలీ సెంటిమెంట్ జోడించి కథ రూపొందించి చిత్రంగా నిర్మించమని సూచించారు.

02/01/2020 - 22:53

ప్రముఖ దర్శకుడు సి పుల్లయ్య కుమారుడు సి శ్రీనివాసరావు. వైవిధ్యభరితమైన సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలను సమర్ధంగా తీర్చిదిద్ది తనకంటూ ప్రత్యేకత సాధించుకున్నారు. వీరి దర్శకత్వంలో జి కృష్ణారావు సమర్పణలో నిర్మాత టి సూర్యనారాయణ నిర్మించిన చిత్రం మళ్లీ పెళ్లి. కృష్ణ, విజయనిర్మల జోడీగా 1970 ఫిబ్రవరి 14న విడుదలైన సినిమా 50ఏళ్లు పూర్తి చేసుకుంది.
*
బ్యానర్: మిత్ర ప్రొడక్షన్స్

01/25/2020 - 22:49

పింజల సుబ్బారావు మచిలీపట్నంలో జన్మించారు. నటునిగా, కొంతకాలం ప్రొడక్షన్ మేనేజర్‌గా చిత్ర పరిశ్రమలో అనుభవం సంపాదించారు. వేస్ట్ ఫిల్మ్ కొనుగోలు -అమ్మకం వ్యాపారాన్నీ కొద్దిరోజుల పాటు నిర్వహించారు. చిత్ర నిర్మాణంపట్ల మక్కువతో తొలుత ఒక తమిళ చిత్రాన్ని ‘రాజద్రోహి’ టైటిల్‌తో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. ‘నానళ్’ అనే తమిళ చిత్రాన్ని ‘హంతకులొస్తున్నారు జాగ్రత్త’ పేరిట తెలుగు చిత్రంగా రూపొందించారు.

01/18/2020 - 23:18

యస్ భావన్నారాయణ తన బంధువైన వైవి రావు (డిటెక్టివ్ కథా రచయిత) భాగస్వామ్యంతో గౌరీ పిక్చర్స్ బ్యానర్‌పై 1964లో తొలిసారి నిర్మించిన చిత్రం -తోటలోపిల్ల కోటలోరాణి. తరువాత పలు వైవిధ్యమైన చిత్రాలను పలు బ్యానర్లపై రూపొందించారు. 1970లో కెవి నందనరావు (కె వాయునందనరావు) దర్శకుడిగా, భావన్నారాయణ సమర్పణలో ఎస్‌విఎస్ బ్రదర్స్ రూపొందించిన చిత్రం -మానాన్న నిర్దోషి.

01/11/2020 - 23:32

విశ్వవిఖ్యాత నట సార్వభమునిగా ఎనలేని కీర్తి గడించారు నటులు నందమూరి తారక రామారావు. నటనతోపాటు దర్శకత్వంపట్ల అభినివేశంతో నటుడిగా వంద చిత్రాలు పూర్తిచేసిన పిమ్మట -తమ ఎన్‌ఏటి బ్యానర్‌పై రూపొందించిన ‘సీతారామకల్యాణం’, ‘గులేబకావళి కథ’ చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. కాని టైటిల్స్‌లో దర్శకునిగా పేరు వేసుకోలేదు.

Pages