S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంటర్ స్పెషల్

10/01/2016 - 21:44

63
మహారాజు అగ్నివర్మ తన శయన మందిరానికి గాలవునీ, కుమార్తెనూ పిలిపించాడు. రాజ్య వ్యవహారాల్నీ, చంపకమాలిని భవిష్యత్తునీ కలిపి మాట్లాడసాగేడు.
‘పరిస్థితులూ, పరిసరాలూ, కాలమూ, వివేకమూ నన్ను హెచ్చరిస్తున్నై. ఇక ఈ సామ్రాజ్య భారాన్ని వహించగల వ్యక్తి మన భాగ్య విశేషంగా లభించాడనిపిస్తోంది. ఏమంటారు?’ ఇరువురినీ ఉద్దేశించి ప్రశ్నించాడు.

09/24/2016 - 21:58

చంద్రహాసుడు లేఖను స్వీకరించి బయలుదేరాడు.
చంద్రహాసుడు - ఆకాశవాయు తత్త్వ సమ్మిళిత స్వభావం కలవాడు. శక్తి సామర్థ్యాలూ, చింతనా, శాంతం వంటి గుణ విశేషాలు - ఆ స్వభావం కలవారి అంతస్సత్యాలు! అవే వారి పురోగమనానికి చోదకశక్తి!
చంద్రహాసుని జననాశ్వం కుంతలపురి వైపు ఉత్సాహంగా పరుగులు తీస్తోంది!
58
ఆశ్వయుజ బహుళ తదియ!

09/18/2016 - 21:06

54
దుష్టబుద్ధి కళింద్రకు వెళ్లిన మర్నాడు-
ఇక్కడ కుంతలపురిలో గాలవుల వారినీ, కుమార్తెనీ తన విశ్రాంతి మందిరంలోకి పిలిపించాడు మహారాజు. కళింద్రకు వెళ్లి అమాత్యులు ఏం చేయనున్నారో అనే ఆందోళన ముగ్గురికీ ఉన్నది. ఆ విషయం మీదే మాటలు సాగాయి. ‘ఏది ఏమైనా కుళిందకుడూ, చంద్రహాసుడూ పరిస్థితిని అర్థం చేసుకోనూగలరు. వలసిన రీతిని ప్రవర్తించనూ గలరు’ అన్నారు గాలవులు.

09/13/2016 - 21:20

అదే సమయంలో- తమ గదుల్లోని పద్మినికీ, దుర్గికీ కూడా నిద్రపట్టక పానుపుపై మసులుతున్నారు. ముసుగు మనిషి ఎవరు? అతడిని వెంబడించిన ముసుగు వీరుడు ఎవరు? ఈ ప్రశ్నలే వారి మనసులనీ సదమదం చేస్తున్నాయి.
కుంజరుడూ, వివరీ, వజ్రసేనుడూ - ఇలా ఎవరికి వారు తలకు మించిన ఆలోచనలతో సతమతమవుతున్నారు.
ఒక్క దుర్ఘటనానుభవం ఇందరినీ ఊపుతోంది.
వీరందరి ఆందోళనలకు ఆవల -

09/13/2016 - 21:20

ఇంతలో వీరందరినీ ఆలయానికి తీసుకువెళ్లటానికి ఇతర అధికారులూ, భటులూ వచ్చారు. వారూ అక్షయునీ, విరజనీ చూసి ఆశ్చర్యచకితులైనారు.

08/28/2016 - 00:41

మర్నాడు-
‘రాచవారిపై విష ప్రయోగం’ అంటూ జనశ్రుతి కరద వాతావరణాన్ని కలుషితం చేయనే చేసింది. ఏర్పాట్ల బాధ్యతని నిర్వర్తించటంలో ఇది పెద్ద లోటుగా - మరిన్ని చిలవలు, పలవలు సమకూరేయి ఆ వార్తకి!
కరదలో నిర్వాహకులయిన అడివప్ప, దక్షణ్ణలు దోషులనే భావన త్వరత్వరగా వ్యాపించింది.

08/21/2016 - 06:04

41
ఆనాటికి కుంతల రాచవారు కరద చేరేరు.
చంపక మాలిని, విషయ, విరజ - వారి ఇష్టసఖులూ, వజ్రసేనుడూ అతని సేవకుడు మాత్రం వచ్చారు. ఈ బృందంలో మదనుడు లేడు.

08/14/2016 - 09:11

39

08/07/2016 - 00:49

36
పురుషోత్తమాచార్యుల వారి ఆశ్రమమే - ఇంకా విశాలంగా తీర్చిదిద్దబడింది.
ఉత్తర భారతం నుండి వచ్చిన మహా పండితులు, వేద వేదాంగ శాస్త్ర పారీణులు అయిన మాధవ దేశికుల వారు - ఇక్కడ తమ ప్రవచనాన్ని ఇస్తున్నారు.
ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. రాజధాని చందనావతిలోని జనమంతా ఇక్కడే ఉన్నారా అన్నట్టు నేల ఈనిన చందంగా చేరారు ప్రజలు.
ప్రముఖులంతా ఉన్నారు.

07/31/2016 - 00:14

ఇద్దరూ కలిసి చంద్రహాసుని దగ్గరకు వెళ్లారు. అక్షయుడూ అక్కడే వున్నాడు.
పద్మిని చెప్పుకొచ్చింది.
నెల రోజుల క్రితం-
నగరంలోని వాణిజ్య భవన సముదాయాలకి ఎదురుగా ఒక వ్యక్తి తనను అనుమానాస్పదంగా చూస్తున్న సంగతి దుర్గి గమనించింది. తర్వాత మరోసారి ఈమె తన మిత్రురాలి జన్మదిన వేడుకలకి వెళ్లి వస్తున్నప్పుడు మళ్లీ... అదే వ్యక్తి తటస్థపడినాడుట.

Pages