S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సెంటర్ స్పెషల్
63
మహారాజు అగ్నివర్మ తన శయన మందిరానికి గాలవునీ, కుమార్తెనూ పిలిపించాడు. రాజ్య వ్యవహారాల్నీ, చంపకమాలిని భవిష్యత్తునీ కలిపి మాట్లాడసాగేడు.
‘పరిస్థితులూ, పరిసరాలూ, కాలమూ, వివేకమూ నన్ను హెచ్చరిస్తున్నై. ఇక ఈ సామ్రాజ్య భారాన్ని వహించగల వ్యక్తి మన భాగ్య విశేషంగా లభించాడనిపిస్తోంది. ఏమంటారు?’ ఇరువురినీ ఉద్దేశించి ప్రశ్నించాడు.
చంద్రహాసుడు లేఖను స్వీకరించి బయలుదేరాడు.
చంద్రహాసుడు - ఆకాశవాయు తత్త్వ సమ్మిళిత స్వభావం కలవాడు. శక్తి సామర్థ్యాలూ, చింతనా, శాంతం వంటి గుణ విశేషాలు - ఆ స్వభావం కలవారి అంతస్సత్యాలు! అవే వారి పురోగమనానికి చోదకశక్తి!
చంద్రహాసుని జననాశ్వం కుంతలపురి వైపు ఉత్సాహంగా పరుగులు తీస్తోంది!
58
ఆశ్వయుజ బహుళ తదియ!
54
దుష్టబుద్ధి కళింద్రకు వెళ్లిన మర్నాడు-
ఇక్కడ కుంతలపురిలో గాలవుల వారినీ, కుమార్తెనీ తన విశ్రాంతి మందిరంలోకి పిలిపించాడు మహారాజు. కళింద్రకు వెళ్లి అమాత్యులు ఏం చేయనున్నారో అనే ఆందోళన ముగ్గురికీ ఉన్నది. ఆ విషయం మీదే మాటలు సాగాయి. ‘ఏది ఏమైనా కుళిందకుడూ, చంద్రహాసుడూ పరిస్థితిని అర్థం చేసుకోనూగలరు. వలసిన రీతిని ప్రవర్తించనూ గలరు’ అన్నారు గాలవులు.
అదే సమయంలో- తమ గదుల్లోని పద్మినికీ, దుర్గికీ కూడా నిద్రపట్టక పానుపుపై మసులుతున్నారు. ముసుగు మనిషి ఎవరు? అతడిని వెంబడించిన ముసుగు వీరుడు ఎవరు? ఈ ప్రశ్నలే వారి మనసులనీ సదమదం చేస్తున్నాయి.
కుంజరుడూ, వివరీ, వజ్రసేనుడూ - ఇలా ఎవరికి వారు తలకు మించిన ఆలోచనలతో సతమతమవుతున్నారు.
ఒక్క దుర్ఘటనానుభవం ఇందరినీ ఊపుతోంది.
వీరందరి ఆందోళనలకు ఆవల -
ఇంతలో వీరందరినీ ఆలయానికి తీసుకువెళ్లటానికి ఇతర అధికారులూ, భటులూ వచ్చారు. వారూ అక్షయునీ, విరజనీ చూసి ఆశ్చర్యచకితులైనారు.
మర్నాడు-
‘రాచవారిపై విష ప్రయోగం’ అంటూ జనశ్రుతి కరద వాతావరణాన్ని కలుషితం చేయనే చేసింది. ఏర్పాట్ల బాధ్యతని నిర్వర్తించటంలో ఇది పెద్ద లోటుగా - మరిన్ని చిలవలు, పలవలు సమకూరేయి ఆ వార్తకి!
కరదలో నిర్వాహకులయిన అడివప్ప, దక్షణ్ణలు దోషులనే భావన త్వరత్వరగా వ్యాపించింది.
41
ఆనాటికి కుంతల రాచవారు కరద చేరేరు.
చంపక మాలిని, విషయ, విరజ - వారి ఇష్టసఖులూ, వజ్రసేనుడూ అతని సేవకుడు మాత్రం వచ్చారు. ఈ బృందంలో మదనుడు లేడు.
36
పురుషోత్తమాచార్యుల వారి ఆశ్రమమే - ఇంకా విశాలంగా తీర్చిదిద్దబడింది.
ఉత్తర భారతం నుండి వచ్చిన మహా పండితులు, వేద వేదాంగ శాస్త్ర పారీణులు అయిన మాధవ దేశికుల వారు - ఇక్కడ తమ ప్రవచనాన్ని ఇస్తున్నారు.
ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. రాజధాని చందనావతిలోని జనమంతా ఇక్కడే ఉన్నారా అన్నట్టు నేల ఈనిన చందంగా చేరారు ప్రజలు.
ప్రముఖులంతా ఉన్నారు.
ఇద్దరూ కలిసి చంద్రహాసుని దగ్గరకు వెళ్లారు. అక్షయుడూ అక్కడే వున్నాడు.
పద్మిని చెప్పుకొచ్చింది.
నెల రోజుల క్రితం-
నగరంలోని వాణిజ్య భవన సముదాయాలకి ఎదురుగా ఒక వ్యక్తి తనను అనుమానాస్పదంగా చూస్తున్న సంగతి దుర్గి గమనించింది. తర్వాత మరోసారి ఈమె తన మిత్రురాలి జన్మదిన వేడుకలకి వెళ్లి వస్తున్నప్పుడు మళ్లీ... అదే వ్యక్తి తటస్థపడినాడుట.