-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్సియు నెలకొన్న పరిస్థితులకు నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
నిజామాబాద్: నవీపేట మండలం సిర్లపల్లి వద్ద గురువారం అర్ధరాత్రి ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు కూలీలు మరణించారు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. రాత్రివేళ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నందున తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం అధికారులు సోదాలు చేసి ఓ వ్యక్తి నుంచి 1.5 కోట్ల రూపాయల విలువచేసే భారత, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఆ నిందితుడు భారీ కరెన్సీతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా తనిఖీ చేసి పట్టుకున్నారు.
తాండూరు రూరల్: రంగారెడ్డి జిల్లా తాండూరులో గురువారం ఇంటి ముందు ఆడుకుంటున్న అక్కాచెల్లెళ్లను పాము కాటు వేసింది. పట్టణంలోని రహమత్నగర్కు చెందిన అబ్దుల్, ఫాతిమా దంపతుల కూతుళ్లు సనాబేగం(6), సౌలీబేగం(3)లు ఇంటి ముందు ఆడుకుంటుండగా.. పాము కాటు వేసింది. దీంతో ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా.. సౌలీబేగం మృతిచెందింది. సనాబేగంను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు.
నిజామాబాద్: ఇద్దరు బాలికలకు మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేసి అత్యాచారానికి ప్రయత్నించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సదాశివనగర్ మండలం రామారెడ్డి గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. 8వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా కిరణ్కుమార్, నితీష్ కుమార్ అనే యువకులు మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేశారు.
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలతో గడువు ముగుస్తుంది. పలు వార్డుల్లో వివిధ పార్టీల తరఫున ఒకరి కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. రెబల్స్గా బరిలో దిగిన వారిని బుజ్జగించేందుకు టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఉపసంహరణ గడువులోగా అభ్యర్థులు సంబంధిత పార్టీల నుంచి బి-్ఫరాలను సమర్పించాల్సి ఉంది
మెదక్: ములుగు మండలంలో మావోయిస్టులకు సహకరిస్తున్న శ్యామ్సుందర్ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మావోయిస్టులకు ఇతను కొరియర్గా పని చేస్తున్నాడని ములుగు ఎస్సై చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలానికి చెందిన శ్యామ్ సుందర్ను కోర్టులో హాజరుపరచి పోలీసులు రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్: దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అనంతరం ఐదో రోజు గురువారం కూడా హెచ్సియులో బంద్ కొనసాగుతోంది. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు దిల్లీ సి.ఎం. కేజ్రీవాల్, సిపిఐ నేతలు సురవరం సుధాకర్రెడ్డి, మాజీ ఎం.పి. అజీజ్ పాషా తదితరులు ఈ రోజు వర్శిటీకి వస్తున్నారు. రాజకీయ నేతల తాకిడి అధికం కావడంతో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, జనవరి 20: ప్రముఖ కళాకారుడు, గేయ రచయిత సుందిళ్ల రాజన్న కుటుంబాన్ని అన్ని విధాల ఆందుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. రాజన్న ముఖ్యమంత్రి ఒఎస్డి దేశపతి శ్రీనివాస్తో కలిసి బుధవారం సిఎంను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. రాజన్న ఈ సందర్భంగా తన పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు.
హైదరాబాద్, జనవరి 20: నాబార్డు ఆర్థిక సహాయంతో తెలంగాణ రాష్ట్రంలో రూ. 1024 కోట్ల వ్యయంతో చేపట్టిన 330 గోదాంల నిర్మాణాలను జూన్ నెలాఖరుకు నాటికి పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. వచ్చే మార్చి నాటికి 100 గోదాంలు, జూన్ నాటికి మరో 230 గోదాంల నిర్మాణం పూర్తి కావాలని మంత్రి సూచించారు.