S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/20/2016 - 03:32

న్యూఢిల్లీ, మే 19: రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో జట్టు కట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధ్యత వహించాలనే వాదనను ఆ పార్టీ తోసిపుచ్చింది. ‘ప్రతి ఎన్నికలోనూ ప్రత్యేకమైన అంశాలు పనిచేస్తాయి.

05/20/2016 - 03:17

న్యూఢిల్లీ, మే 19: అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో బిజెపి, అన్నా డిఎంకె, డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, వాపపక్షాలతో పాటు కాంగ్రెస్ కూడా కొత్త చరిత్రను సృష్టించింది. అసోంలో భారీ మెజారిటీతో మొదటిసారి అధికారంలోకి రావటంతో పాటు కేరళ, పశ్చిమబెంగాల్‌లో తన ఖాతాలను తెరవటం ద్వారా బిజెపి కొత్త రాజకీయ చరిత్రకు శ్రీకారం చుట్టింది. పశ్చిమబెంగాల్‌లో బిజెపి ఏడు సీట్లు, కేరళలో ఒక సీటు గెలిచింది.

05/20/2016 - 03:13

గౌహతి, మే 19: పదిహేనేళ్లుగా తిరుగులేని అధికారాన్ని అనుభవించిన తరుణ్‌గొగోయ్ పాలనకు అసోం ప్రజలు స్వస్తి పలికారు. ఈశాన్య భారతంలో మొట్టమొదటిసారి మోదీ బృందానికి బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారాన్ని అప్పజెప్పారు. అసోం అసెంబ్లీలోని 126 స్థానాల్లో మొత్తం బీజేపీ దాని మిత్రపక్షాలు ఏకంగా 86స్థానాల్లో విజయాన్ని నమోదు చేసి అద్భుతం సృష్టించాయి.

05/20/2016 - 03:11

కోల్‌కతా, మే 19: ప్రభుత్వ వ్యతిరేత, ప్రతిపక్షాలయిన వామపక్షాలు, కాంగ్రెస్ చేతులు కలపడంలాంటి ప్రతికూల పవనాలకు ఎదురొడ్డి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మూడింట రెండు వంతుల భారీ మెజారిటీని సాధించి మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది. గురువారం ప్రకటించిన ఫలితాల్లో 294 స్థానాలున్న అసెంబ్లీలో ఆ పార్టీ 211 స్థానాలను దక్కించుకుంది.

05/20/2016 - 03:09

చెన్నై, మే 19: తమిళనాడు ప్రజలు చరిత్ర సృష్టించారు. మూడు దశాబ్దాల తరువాత అధికారంలో ఉన్న పార్టీకి రెండోసారి పాలించే అవకాశాన్ని అందించారు. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలలో పురచ్చితలైవి జయలలిత దరహాసం వెల్లివిరిసింది. 232 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకే 134 స్థానాలను కైవసం చేసుకుంది.

05/20/2016 - 03:06

యానాం, మే 19: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో యానాం నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు వరుసగా ఐదోసారి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్థి తిరుకోటి భైరవస్వామిపై 8,762 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

05/20/2016 - 03:03

విజయవాడ , మే 19: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన నేతలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. అస్సాంలో అధికారాన్ని సాధించినందుకు, ఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచుకొని, మెరుగైన ఫలితాలను సాధించినందుకు ప్రధాని నరేంద్రమోదీని, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాను చంద్రబాబు అభినందించారు.
జయలలితతో మాట్లాడిన ఏపి సిఎం

05/20/2016 - 03:01

తిరువనంతపురం, మే 19: కేరళలో సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యుడిఎఫ్ కూటమిని చిత్తుచేసి తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. దీంతో ఒక సారి గెలిచిన కూటమి మరోసారి గెలవకపోవడం అనే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ రాష్ట్రంలో మరోసారి పునరావృతమైంది.

05/20/2016 - 02:36

దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పులనే ఇచ్చారు. అసోంలో తొలిసారి బిజెపికి పట్టం కట్టి చరిత్రను తిరగరాశారు. పదిహేనేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని సాగనంపారు. కేరళలో తొలిసారిగా బిజెపి ఖాతాతెరవడం మరో కీలక పరిణామం. జయ ఇంటికేనన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నివ్వెరపోయేలా అన్నాడిఎంకెను మళ్లీ అధికారంలోకి తెచ్చారు.

05/20/2016 - 02:36

దిల్లీ: తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటింగ్ శాతం పెరిగిందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా గురువారం మీడియాకు తెలిపారు. అస్సాంలో కూటమిగా పోటీ చేసినప్పటికీ తమ పార్టీకి సొంతంగా మెజారిటీ లభించిందన్నారు. ఇక ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తాను దృష్టిపెడతానని ఆయన తెలిపారు.

Pages