జాతీయ వార్తలు

యానాంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి ఐదోసారి ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యానాం, మే 19: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో యానాం నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు వరుసగా ఐదోసారి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్థి తిరుకోటి భైరవస్వామిపై 8,762 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో పోలైన 33,899 ఓట్లలో మల్లాడి 20,801 ఓట్లను పొందగా, ఎన్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి తిరుకోటి భైరవస్వామి 12,047 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. అన్నాడిఎంకె అభ్యర్థి మంచాల సత్యసాయికుమార్ 343 ఓట్లు, బిజెపి అభ్యర్థి కనకాల రామదాసు 148 ఓట్లు సాధించి డిపాజిట్లు కోల్పోయారు. పలువురు స్వతంత్ర అభ్యర్థులు సైతం డిపాజిట్లు కోల్పోయారు. 144 మంది నోటా ఉపయోగించారు. రిటర్నింగ్ అధికారి పార్ధిబన్ మల్లాడికి ఎనికైనట్టు ధ్రువీకరణపత్రం అందించారు.

చిత్రం మల్లాడి కృష్ణారావు