S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/27/2016 - 16:26

న్యూఢిల్లి:కార్పొరేట్ వ్యవహారాల శాఖ మాజీ డైరక్టర్ జనరల్ బికె బన్సాల్ తన కుమారుడితో కలసి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజధానిలోని మధురానగర్‌లో ఆయన నివాసంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ ఫార్మ కంపెనీనుంచి గత జూలైలో 9 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో కేసు నమోదైంది. ఆయన జైలుపాలయ్యారు. ఆ తరువాత కేసు సీబిఐకు చేరింది.

09/27/2016 - 16:25

న్యూఢిల్లి:కావేరీ జలాల విడుదల విషయంలో కర్నాటకకు మరోసారి చుక్కెదురైంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈనెల 27వరకు తమిళనాడుకు రోజుకు 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా అందుకు అంగీకరించని కర్నాటక నీటి విడుదల నిలిపివేతపై అసెంబ్లీలో తీర్మానం చేసింది. సుప్రీం తీర్పును పునస్సమీక్షించాలని కోర్టులో అపీల్ చేసింది.

09/27/2016 - 02:51

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 26: నూతన సాంకేతిక ఒరవడికి ఇస్రో శ్రీకారం చుట్టిందని ఆ సంస్థ చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ అన్నారు. సోమవారం పి ఎస్ ఎల్‌వి-సి 35 ప్రయోగ విజయం అనంరతం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో మీడియా సెంటర్‌లో శాస్తవ్రేత్తలతో కలసి ఆయన విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సాంకేతిక విధాన ప్రయోగాల్లో తొలిసారే ఇస్రో ఎంతో ఘనత సాధించదన్నారు.

09/27/2016 - 02:45

భద్రాచలం, సెప్టెంబర్ 26: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్, కొండగావ్ జిల్లాల్లో సోమవారం వేర్వేరుగా జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. నారాయణ్‌పూర్ జిల్లా తోయ్‌నార్ అటవీ ప్రాంతంలో డిఆర్‌జీ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా నక్సల్స్ తారసపడ్డారు. సుమారు గంటసేపు కాల్పులు జరిగాయి. సంఘటన ప్రదేశంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

09/27/2016 - 02:42

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26:వైద్య కళాశాల సీట్ల కౌనె్సలింగ్ నిర్వహణకు మరో నెల రోజులు గడువు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా తెలంగాణకు గడువు పొడిగిస్తే ఏపీ వైద్య కళాశాలల సీట్ల కౌనె్సలింగ్‌కు సైతం గడువు పొడిగించాలంటూ ఏపీ ప్రైవేటు మెడికల్, దంత వైద్య కళాశాలల యాజమాన్య సంఘం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

09/27/2016 - 02:14

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: కావేరీ జలాల వివాదం సోమవారం అనూహ్యమైన మలుపు తిరిగింది. తమ రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా జలాలు లేవంటూ తమిళనాడు పిటిషన్ దాఖలు చేస్తే.. రోజుకు ఆరువేల క్యూసెక్కుల నీటిని ఇవ్వలేమని, గతంలో ఇచ్చిన తీర్పు సవరించాలంటూ కర్ణాటక కూడా పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు తమ అవసరాలు, పరిస్థితులను విశదీకరిస్తూ ఈ పిటిషన్లలో వాదనలు వినిపించాయి.

09/27/2016 - 02:13

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: దేశంలో రోజురోజుకు సాగుభూమి, జల వనరులు తగ్గిపోతుండటం వల్ల పంటల దిగుబడులను పెంచడానికి శాస్ర్తియమైన పరిష్కారాన్ని కనుగొనాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శాస్తవ్రేత్తలకు పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞాన ప్రయోజనాలు సామాన్య మానవుడికి చేరేలా సరయిన భాగస్వాములను ఒక్కచోటికి తీసుకురావలసిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

09/27/2016 - 02:11

డిస్పూర్, సెప్టెంబర్ 26: రెండేళ్ల క్రితం సంభవించిన బర్ద్వాన్ పేలుళ్ల కేసు దర్యాప్తులో పోలీసులు గొప్ప పురోగతి సాధించారు. బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎంబి) ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లుగా భావిస్తున్న పోలీసులు ఆ సంస్థకు చెందిన ఆరుగురు మిలిటెంట్లను సోమవారం పశ్చిమ బెంగాల్, అస్సాంలలో అరెస్టు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం..

09/27/2016 - 02:09

కొల్లాం, సెప్టెంబర్ 26: దేశంలో ఉన్నత విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నాణ్యమైన విద్యను అందిస్తూ మెరుగైన ప్రమాణాలు పాటిస్తున్న విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని యోచిస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జావడేకర్ సోమవారం వెల్లడించారు. సమర్థవంతంగా పనిచేయని విద్యా సంస్థలను క్రమబద్ధం చేయనున్నట్టు ఆయన తెలిపారు.

,
09/27/2016 - 02:07

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్ తనపై ఎన్ని చెప్పులు వేయించినా భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.

Pages