S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘వీరి వీరి గుమ్మడిపండు చిత్రం అంతా హా రర్ జోనర్లోనే సాగుతుంది. విశ్రాంతికి ముందు ఇంట్లో దయ్యం ఉందని తెలుస్తుంది, సెకండాఫ్లో ఆ ఇంట్లోవున్న మనుషుల్లో ఒకరిలో దయ్యం వుందని తెలుస్తుంది. చివరికి ఏమైంది’ అన్న కథనంతో కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులకు నచ్చేటట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించామని చిత్ర దర్శకుడు ఎం.వి. సాగర్ తెలిపారు.
‘లజ్జ చిత్రాన్ని నా శైలిలోనే చిత్రీకరించా. అలాగే నా పంథాలోనే ఏదో ఒకరోజు భారీ కమర్షియల్ హిట్ కొడతానన్న నమ్మకం వుంది. స్నేహితులతో కలసి నేను స్థాపించిన సంస్థ ద్వారా ప్రతీ ఏడాది ఓ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నా’ అని దర్శకుడు సంపత్ నంది అంటున్నారు.
టాలీవుడ్లో టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వౌనవ్రతం పాటిస్తోంది. ఆమె చిత్రాలు ఈమధ్యకాలంలో విడుదలై చాలా రోజులైంది. అసలు తెలుగు ప్రేక్షకులు సమంతను మర్చిపోయే దశకు వచ్చేశారు. సమంత కూడా ఎక్కడా తన మాట వినిపించకుండా జాగ్రత్త పడుతోంది. దాదాపుగా అజ్ఞాతంలో వుండిపోయినట్లుగా ఒక్క ట్వీట్ కూడా ఇవ్వడం లేదు. డిసెంబర్ నుండి సమంత ఆచూకీ చెప్పేవాళ్ళే కరువయ్యారు.
అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై సతీష్కాశెట్టి దర్శకత్వంలో శ్రీకాంత్, నిఖిత జంటగా షేక్ మస్తాన్ రూపొందించిన చిత్రం ‘టెర్రర్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 26న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ను శనివారం ప్రసాద్ ల్యాబ్లో విడుదల చేశారు. ముందుగా నరేష్ మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ చిత్రం గురించే తాము మాట్లాడుకున్నామని, తప్పక విజయవంతవౌతుందని తెలిపారు.
లైకా ప్రొడక్షన్స్ సంస్థ జి.వి.ప్రకాష్కుమార్ కథానాయకుడుగా శామ్ఆంటోన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నాకు ఇంకోపేరుంది’. ఈ చిత్రానికి సంబంధించిన 40 రోజుల షూటింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలిమ్స్ పతాకంపై ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మి జైనీ రూపొందిస్తున్న చిత్రం ‘అంపశయ్య’. సుప్రసిద్ధ రచయిత అంపశయ్య నవీన్ తీర్చిదిద్దిన ఏళ్లనాటి కథను సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నారు. శ్యామ్కుమార్, పావని జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.
అప్పట్లో క్రేజీ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గ్లామర్ భామ ఛార్మీకి ఈమధ్య అవకాశాలు బాగా సన్నగిల్లాయి. ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు చేతిలో లేకపోవడంతో మరోవైపు తమిళ, కన్నడ భాషల్లో కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే చాలా చిత్రాల్లో నటించిన ఈమెకు ఇంకా కొన్ని తీరని కోరికలు ఉన్నాయట. అవి ఏంటంటే దశావతారంలో కమల్హాసన్ చేసినట్టు పది పాత్రలతో ఓ సినిమా చేయాలని కోరిక వుందట.
ఇన్నాళ్లూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన యువనటి సోనమ్ కపూర్ ‘నీరజ’ సినిమాకు ‘హిట్’ టాక్ రావడంతో ఇపుడు ఆనందలోకంలో విహరిస్తోంది. 359 మంది విమాన ప్రయాణీకులను కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన సాహసవనిత నీరజా బానోత్ జీవితకథ ఆధారంగా తీసిన ఈ సినిమాలో తాను కష్టపడి నటించానని ఆమె చెబుతోంది. అవార్డు వస్తుందన్న ఆశతో కాకుండా, నీరజ పాత్ర తనను ఎంతగానో కదిలించడంతో చేశానని సోనమ్ తెలిపింది.
సుమంత్ అశ్విన్ కథానాయకుడుగా రూపొందిన ‘రైట్ రైట్’ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను నటుడు సునీల్ విజిల్ ఊది విడుదల చేశారు. శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వంశీకృష్ణ రూపొందించిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా నటిస్తున్నారు.
ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎం.రాజ్కుమార్ రూపొందించిన చిత్రం ‘గుంటూరు టాకీస్’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది.