గుంటూరు టాకీస్ ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎం.రాజ్‌కుమార్ రూపొందించిన చిత్రం ‘గుంటూరు టాకీస్’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సిద్దు జొన్నలగడ్డ, రష్మీ గౌతమ్, శ్రద్ధాదాస్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం గురించి నరేష్ మాట్లాడుతూ, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుని సినిమాలు రూపొందించే ప్రవీణ్ సత్తార్ మూడో చిత్రం ఇదని, దాదాపు సంవత్సరంన్నర నుండి ఈ సినిమాను రూపొందిస్తున్నారని, మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఓ మార్పు తీసుకొచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించామని, ఈ సినిమాకోసం అందరు కష్టపడ్డారని, మార్చి 4న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెలిపారు. ఈ స్టోరీ విన్నప్పుడు వైవిధ్యంగా తోచిందని, డెమో ఇచ్చిన తర్వాత చాలా ఫ్రీడమ్ ఇచ్చి ఈ పాటలు చేయించుకున్నారని, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల అన్నారు. కథానాయికగా ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం ఆనందంగా వుందని రేష్మీ, తనకు ఈ చిత్రం ఎప్పటికీ గుర్తు వుంటుందని, మంచి పేరు వస్తుందని సిద్ధు తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాంత్ పేరేపు, మంచులక్ష్మి, మధుశాలిని, సముద్ర, బెక్కం వేణుగోపాల్, అనసూయ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామిరెడ్డి, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, నిర్మాత: రాజ్‌కుమార్, కథ, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.