S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/27/2016 - 06:35

న్యూఢిల్లీ, జూలై 26: ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మింత్రా.. తమ ప్రత్యర్థి జబాంగ్‌ను చేజిక్కించుకుంది. దాదాపు 470 కోట్ల రూపాయలకు (70 మిలియన్ డాలర్లు) గ్లోబల్ ఫ్యాషన్ గ్రూప్ (జిఎఫ్‌జి) నుంచి కొనుగోలు చేసింది. జబాంగ్‌ను సొంతం చేసుకోవాలని స్నాప్‌డీల్, ఫ్యూచర్ గ్రూప్, ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన ఎబోఫ్ తదితర సంస్థలు పోటీపడినా ఫలితం లేకపోయింది.

07/27/2016 - 06:27

ముంబయి, జూలై 26: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 118.82 పాయింట్లు కోల్పోయి 27,976.52 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 45 పాయింట్లు దిగజారి 8,590.65 వద్ద నిలిచింది. అమెరికా, జపాన్ సెంట్రల్ బ్యాంక్‌ల సమావేశాల క్రమంలో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు.

07/27/2016 - 06:26

న్యూఢిల్లీ, జూలై 26: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మరో మూడు బ్యాంకులపై మంగళవారం జరిమానా విధించింది. మనీలాండరింగ్ నిబంధనల ఉల్లంఘనకుగాను అలహాబాద్ బ్యాంక్, యూకో బ్యాంక్‌లపై 2 కోట్లు చొప్పున, బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కోటి మేర జరిమానా వేసింది. సోమవారం బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లపై 10 కోట్ల జరిమానా విధించింది.

07/27/2016 - 06:25

న్యూఢిల్లీ, జూలై 26: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 1,486.2 కోట్ల రూపాయల నికర లాభాన్ని అందుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి త్రైమాసికంలో 1,208.1 కోట్ల రూపాయల నికర లాభాన్ని అందుకోగా, ఈసారి 23 శాతం లాభం పెరిగినట్లైంది. నికర అమ్మకాలు ఈసారి 14,654.5 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 13,078.3 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

07/27/2016 - 06:23

ముంబయి, జూలై 26: దేశీయ ఐటిరంగ దిగ్గజాలైన టిసిఎస్, ఇన్ఫోసిస్, ఔషధరంగ దిగ్గజాలైన సన్ ఫార్మా, లుపిన్, ప్రైవేట్‌రంగ బ్యాంకులైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు.. ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ భారతీయ సూపర్ 50 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అయితే ప్రముఖ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్, ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ (హెచ్‌యుఎల్) ఈ ఏడాది జాబితాలో స్థానం పొందలేకపోయాయి.

07/27/2016 - 06:22

కాకినాడ, జూలై 26: సకాలంలో ఆదాయ పన్నును చెల్లిస్తే ఎటువంటి సమస్యలు ఎదురుకావని, విధిగా ఆదాయ పన్ను చెల్లించాలని విశాఖ ఆదాయ పన్ను కమిషనరేట్-2 ప్రిన్సిపల్ కమిషనర్ ఓంకారేశ్వర్ చిదార సూచించారు. ఆదాయ పన్ను ఎగవేతదారులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్ ద్వారా ఆదాయ వెల్లడి పథకం-2016ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.

07/26/2016 - 05:27

న్యూఢిల్లీ, జూలై 25: బజాజ్ ఆటో ప్రతిష్ఠాత్మక ద్విచక్ర వాహనం ‘వి’ అమ్మకాలు లక్ష మార్కును దాటాయి. ఐఎన్‌ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక లోహంతో వి బైకులను బజాజ్ తయారు చేస్తున్నది తెలిసిందే. 150సిసి సామర్థ్యంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్‌కు పరిచయమైన వి బైక్ పంపిణీ మార్చి 23 నుంచి మొదలైంది.

07/26/2016 - 05:27

ముంబయి, జూలై 25: ప్రభుత్వరంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ప్రైవేట్‌రంగ బ్యాంకైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సోమవారం జరిమానాలు వేసింది. నిరుడు చోటుచేసుకున్న 6,100 కోట్ల రూపాయల కుంభకోణంలో తాజాగా బ్యాంక్ లోపాలు బయటపడటంతో బ్యాంక్ ఆఫ్ బరోడాపై 5 కోట్ల రూపాయల జరిమానాను విధించిన ఆర్‌బిఐ..

,
07/26/2016 - 05:26

న్యూయార్క్, జూలై 25: యాహూ ఆపరేటింగ్ వ్యాపారాన్ని వెరిజోన్ కమ్యూనికేషన్స్ సొంతం చేసుకుంది. సుమారు 4.83 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఓ ఒప్పందం ఇక్కడ కుదిరింది. నిన్నటి తరం వెబ్ యూజర్ల ఇంటర్నెట్ ప్రవేశానికి ప్రధాన ద్వారంగా వెలిగిన యాహూ.. గూగుల్, ఫేస్‌బుక్ తదితర నేటి తరం ఇంటర్నెట్ దిగ్గజాల ముందు చతికిలపడింది.

07/26/2016 - 05:24

న్యూఢిల్లీ, జూలై 25: దేశీయ ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్).. భారతీయ ఐటి పరిశ్రమలో అత్యధిక ఉద్యోగులున్న సంస్థగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, క్యాప్‌జెమినీ సంస్థలున్నట్లు ఐటి పరిశ్రమల సంఘం నాస్కామ్ ఓ ప్రకటనలో సోమవారం తెలిపింది.

Pages